తెలంగాణ

telangana

By

Published : Aug 22, 2020, 2:43 PM IST

ETV Bharat / bharat

'దిల్లీ, అయోధ్యలో బాంబు దాడుల పేరిట బెదిరింపు!'

దిల్లీ, అయోధ్య, పంజాబ్​లో బాంబు పేలుళ్లతో ఉగ్రవాదులు విధ్వంసం సృష్టించబోతున్నారని అంబాలా ఎయిర్​ ఫోర్స్​ స్టేషన్​కు అందిన ఓ లేఖ కలకలం రేపింది. దీనిపై దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. ఈ కుట్రలో 15మంది పాల్గొంటున్నారని, వారిలో విశ్రాంత సైనికాధికారులు ఉన్నారని లేఖలో ఉంది.

threating letter of bombing at ambala air base station
'దిల్లీ, అయోధ్యలో బాంబు దాడులు జరుగుతాయని లేఖ'

హరియాణా అంబాలా ఎయిర్​ఫోర్స్​ స్టేషన్​కు అందిన ఓ లేఖ కలకలం రేపుతోంది. ఈ స్టేషన్​తో పాటు దేశ రాజధాని దిల్లీ, అయోధ్య, పంజాబ్​లో పేలుళ్లు జరిపి విధ్వంసం సృష్టించేందుకు 15మంది కుట్రపన్నుతున్నారని ఆ లేఖలో ఉంది. దీనికి ప్రధాన సూత్రధారి జలంధర్​ రామామండీకి చెందిన రాజేశ్​ వైశ్​ అని లేఖ పేర్కొంది.

ఈ లేఖను పంపిన వ్యక్తి పేరు గూఢచారి మౌనిక అని ఉంది. ఉగ్రవాదులు తనను బంధిస్తే వారి నుంచి తప్పించుకుని లేఖ ద్వారా విషయం తెలియజేస్తున్నట్లు పేర్కొంది. ఈ దాడులు జరిపేందుకు పాకిస్థాన్​ రూ.25కోట్లు ఇస్తున్నట్లు లేఖలో ఉంది.

ఈ లేఖను అంబాలా ఎయిర్​ఫోర్స్ స్టేషన్​తో పాటు సీఆర్​పీఎఫ్​, ఐటీబీపీ, సీఐఎస్​ఎఫ్​కు కూడా పంపినట్లు మోనికా పేర్కొంది. దాడులకు కుట్ర పన్నుతున్న 15మందిలో సైన్యంలో పని చేసిన ఇద్దరు మాజీ ఉద్యోగులు ఉన్నట్లు తెలిపింది.

ఈ విషయంపై స్పష్టత కోరేందుకు అంబాలా కంటోన్మెంట్ డీఎస్పీ రామ్​కుమార్​ను ఈటీవీ భారత్​ సంప్రదించింది. లేఖ వచ్చింది వాస్తవమేనని, దీనిపై విచారణ జరుపుతున్నట్లు ఆయన చెప్పారు. ప్రస్తుతానికి దీనిని ఫేక్​ అని భావిస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చూడండి: జమ్ముకశ్మీర్​లో ఎన్​కౌంటర్​.. ఉగ్రవాది హతం

ABOUT THE AUTHOR

...view details