తెలంగాణ

telangana

By

Published : Jun 14, 2019, 7:37 PM IST

ETV Bharat / bharat

'బంగాల్​లో ఉండాలంటే బెంగాలీ నేర్చుకోవాల్సిందే'

బంగాల్​లో నివసిస్తున్న వారు బెంగాలీ బాషలో మాట్లాడటం నేర్చుకుని తీరాలని స్పష్టంచేశారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. బెంగాలీలు, మైనార్టీలపై భాజపా దాడులకు పాల్పడుతోందని ఆరోపించారు.

'బంగాల్​లో ఉండాలంటే బెంగాలీ నేర్చుకోవాల్సిందే'

బంగాల్​లో అధికార తృణమూల్​ కాంగ్రెస్​, భాజపా మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా భాజపాపై తీవ్ర విమర్శలు చేశారు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. అధికారం కోసం రాష్ట్రాన్ని గుజరాత్​లా మార్చేందుకు బంగాలీలు, మైనార్టీలే లక్ష్యంగా దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. బంగాల్​లో నివసించేవారు బెంగాలీ భాష మాట్లాడటం నేర్చుకోవాల్సిందేనని స్పష్టంచేశారు మమత.

భాజపా నేత ముకుల్​ రాయ్ ఇలాకా అయిన ఉత్తర 24 పరగణాల​ జిల్లాలోని కంచ్రపారలో బహిరంగ సభలో ప్రసంగించారు మమత.

"బంగ్లా భాషను మేము ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటున్నాం. మేము దిల్లీకి వెళ్లినప్పుడు హిందీ మాట్లాడతాం. పంజాబ్​ వెళ్తే పంజాబీలో మాట్లాడాలి. అది నేను చేస్తాను. తమిళనాడు వెళ్లినప్పుడు... నాకు తమిళం రాదు. కానీ కొన్ని పదాలు తెలుసు. అదే విధంగా మీరు బంగాల్​ వస్తే బెంగాలీలోనే మాట్లాడాలి. బయటి రాష్ట్రాల నుంచి వచ్చి బెంగాలీలపై దాడులు చేయటాన్ని మేము అనుమతించం.

ఈవీఎంల ట్యాంపరింగ్​ ద్వారా కొన్ని సీట్లు గెలిచినంత మాత్రాన బెంగాలీలు, మైనార్టీలపై దాడులు చేయాలనుకోవటం సరైంది కాదు. దానిని మేము క్షమించం. పోకిరీలపై పోలీసులు చర్యలు తీసుకుంటారు. బంగాల్​లో నివసిస్తున్న ఆడ, మగ ఎవరైనా బెంగాలీ భాషలో మాట్లాడాలి."

- మమతా బెనర్జీ, బంగాల్​ ముఖ్యమంత్రి

బంగాలీలు, బంగాలీయేతరుల మధ్య భాజపా విభజన రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు దీదీ.

ఇదీ చూడండి: మహిళలకు ఉచిత ప్రయాణంపై 'మెట్రోమ్యాన్'​ గరం

ABOUT THE AUTHOR

...view details