తెలంగాణ

telangana

By

Published : Apr 18, 2019, 7:04 AM IST

ETV Bharat / bharat

ఇది రామ - రావణ యుద్ధం: సిద్ధూ

లోక్​సభ ఎన్నికలను రామ- రావణ యుద్ధంతో పోల్చారు కాంగ్రెస్ నేత నవజ్యోత్​ సింగ్ సిద్ధూ. ప్రస్తుత పరిస్థితులను చూస్తే శ్రీకృష్ణుడు- కంసుడు, గాంధీ- గాడ్సేల మధ్య పోరుగా ఉందని వ్యాఖ్యానించారు.

నవజోత్​ సింగ్ సిద్ధు

మోదీపై సిద్ధు వ్యంగ్యాస్త్రాలు

భాజపాను ప్రతినాయకులతో పోలుస్తూ కాంగ్రెస్ నేత నవజ్యోత్​ సింగ్ సిద్ధూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గుజరాత్​లోని ఢోల్కా పట్టణంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఈ మాజీ క్రికెటర్​.. ప్రధాని నరేంద్రమోదీపై పరోక్ష విమర్శలు చేశారు.

"సముద్ర గర్భంలోచైనా రైల్వే మార్గం నిర్మిస్తోంది. అంగారకుడిపై జీవం మనుగడపై అమెరికా పరిశోధనలు చేస్తోంది. మర సైనికులను రూపొందించే ప్రయత్నాల్లో రష్యా ఉంది. భారత్​లో మాత్రం దొంగ కాపలాదారుల తయారీ జరుగుతోంది."

-నవజ్యోత్​​ సింగ్​ సిద్ధూ, కాంగ్రెస్ నేత

ప్రస్తుత లోక్​సభ ఎన్నికలను పరిశీలిస్తే రాముడు - రావణుడు , శ్రీకృష్ణుడు-కంసుడు, గాంధీ-గాడ్సేల మధ్య పోరును చూసినట్టు ఉందని సిద్ధూ వ్యాఖ్యానించారు.

ఇదీ చూడండి: కాసేపట్లో సార్వత్రిక ఎన్నికల రెండో దశ పోలింగ్​

ABOUT THE AUTHOR

...view details