తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వాళ్లకు ద్వేషంతో కళ్లు మూసుకుపోయాయి: రాహుల్

నోబెల్ గ్రహీత అభిజిత్ బెనర్జీ వామపక్షవాది అని కేంద్ర మంత్రి పీయూష్​ గోయల్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. విద్వేషంతో కళ్లుమూసుకుపోయిన వాళ్లకు వృత్తినిపుణులు అంటే ఎవరో తెలియదని ధ్వజమెత్తారు.

By

Published : Oct 20, 2019, 12:27 PM IST

Updated : Oct 20, 2019, 8:01 PM IST

వాళ్లకు ద్వేషంతో కళ్లు మూసుకుపోయాయి: రాహుల్

వాళ్లకు ద్వేషంతో కళ్లు మూసుకుపోయాయి: రాహుల్

కేంద్రమంత్రి పీయూష్ గోయల్​పై​ తీవ్ర విమర్శలు చేశారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. అర్థశాస్త్రంలో నోబెల్​ బహుమతి పొందిన అభిజిత్ బెనర్జీ వామపక్షవాది అని గోయల్​ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. ద్వేషంతో కళ్లు మూసుకుపోయిన దురభిమానులకు.. వృత్తినిపుణులంటే ఎవరనే విషయంపై కనీస అవగాహన లేదని మండిపడ్డారు రాహుల్​. ఈ విషయంపై ట్వీట్ చేశారు.

"బెనర్జీ.. విద్వేషంతో కళ్లుమూసుకుపోయిన వీళ్లకు ఫ్రొపెషనల్​ అంటే తెలియదు. మీరు వాళ్లకు చెప్పాలని 10 ఏళ్లు ప్రయత్నించినా అర్థం చేసుకోలేరు. కోట్ల మంది భారతీయులు మీ పనిపట్ల గర్వంగా ఉన్నారు."
-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత.

కాంగ్రెస్​కు న్యాయ్​ పథకం సలహా ఇచ్చిన అభిజిత్ బెనర్జీ వామపక్ష వాది.. ఆయన సిఫారసు చేసిన పథకాన్ని ప్రజలు తిరస్కరించారని శుక్రవారం పీయూష్​ గోయల్​ అన్నారు. ఈ విషయంపై శనివారం స్వయంగా స్పందించారు అభిజిత్. వాణిజ్య శాఖ మంత్రి తన వృత్తి నిబద్ధతను ప్రశ్నిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ వార్తను జోడిస్తూ గోయల్​పై తాజా విమర్శలు చేశారు రాహుల్.

ఇదీ చూడండి: 'మహా'పోరు: పైకి పొత్తులు... లోన కత్తులు!

Last Updated : Oct 20, 2019, 8:01 PM IST

ABOUT THE AUTHOR

...view details