తెలంగాణ

telangana

అల్లుడిని చంపబోయి పోలీసులకు చిక్కిన అత్తమామలు

By

Published : Feb 15, 2020, 7:54 PM IST

Updated : Mar 1, 2020, 11:18 AM IST

కర్ణాటక మాండ్య జిల్లాలో ఓ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. సొంత అల్లుడిని చంపమని ఓ ముఠాకు సుపారీ ఇచ్చింది ఓ జంట. చివరకు ఆ ముఠా చేతుల్లోనే దోపిడికి గురై చివరకు కటకటాలపాలయ్యారు.

The couple who gave Supari to kill son in law
అల్లుడిని చంపబోయి పోలీసులకు చిక్కిన దంపతులు

అల్లుణ్ని చంపాలంటూ ముఠాకు సుపారీ ఇచ్చిన ఓ జంట..వారి చేతిలోనే దోపిడికి గురై చివరకు కటకటాల పాలైన ఘటన కర్ణాటకలో జరిగింది. సినీఫక్కీలో జరిగిన ఈ ఘటన కర్ణాటకలోని మాండ్య జిల్లాలో చోటుచేసుకుంది.

కులాంతర వివాహం..

మాండ్యకు చెందిన వెంకటేశ్‌, పుట్టతాయమ్మ దంపతుల కుమార్తె కులాంతర వివాహం చేసుకుంది. వేరే కులానికి చెందిన వ్యక్తిని అల్లుడిగా అంగీకరించలేని వెంకటేశ్‌ దంపతులు.. బెంగళూరుకు చెందిన మహదేవ, కుమార, లోకేశ్‌, మోహన్‌లకు తమ కుమార్తె భర్తను చంపాలని సుపారీ ఇచ్చారు. ఇందుకోసం సగం డబ్బును ముందస్తుగా ముట్టజెప్పారు.

అల్లుడిని చంపబోయి పోలీసులకు చిక్కిన దంపతులు

పోలీసుల అదుపులో..

అయితే ముఠా సభ్యులు పూర్తి డబ్బు ఇవ్వాలంటూ బెదిరించడం సహా వారినే దోచుకున్నారు. అనంతరం.. ఆ ముఠా పోలీసులకు దొరికిపోయింది. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు సుపారీ వ్యవహారం తెలిసింది. ఫలితంగా అల్లుడ్ని చంపడానికి యత్నించిన వెంకటేశ్‌ దంపతులను కూడా అదుపులోకి తీసుకున్నారు.

ఇదీ చదవండి:ట్యాంకర్లతో లవ్ షేప్.. ప్రేయసికి సైనికాధికారి ప్రపోజ్​

Last Updated : Mar 1, 2020, 11:18 AM IST

ABOUT THE AUTHOR

...view details