తెలంగాణ

telangana

'ప్రణబ్​ ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు'

By

Published : Aug 22, 2020, 12:38 PM IST

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం నిలకడగానే ఉందని ఆర్మీ ఆస్పత్రి వైద్యులు బులెటిన్ విడుదల చేశారు. ముఖ్యమైన పారామితులు స్థిరంగా ఉన్నట్లు పేర్కొన్నారు. వెంటిలేటర్​పైనే ఊపిరితిత్తుల ఇన్​ఫెక్షన్​కు సంబంధించి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు.

The condition of former president Pranab Mukherjee remains unchanged this morning
'ప్రణబ్​ ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు'

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదని దిల్లీలోని ఆర్మీ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఆయన ఇంకా అపస్మారక స్థితిలోనే ఉన్నారని, ముఖ్యమైన పారామితులు స్థిరంగా ఉన్నట్లు శనివారం ఉదయం విడుదల చేసిన హెల్త్​ బులెటిన్​లో పేర్కొన్నారు.

ప్రణబ్​ ముఖర్జీని వెంటిలేటర్​ పైనే ఉంచి చికిత్స అందిస్తున్నామని, ఊపిరితిత్తుల ఇన్​ఫెక్షన్​కు చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు చెప్పారు.

మెదడులో రక్తం గడ్డకట్టడంతో ప్రణబ్‌కు ఈ నెల 10వ తేదీన శస్త్రచికిత్స చేశారు. ఆ సమయంలో జరిపిన వైద్య పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయింది.

ఇదీ చూడండి: 'సెప్టెంబరు మొదటివారంలో తీవ్ర స్థాయికి కరోనా'

ABOUT THE AUTHOR

...view details