తెలంగాణ

telangana

By

Published : Apr 13, 2019, 11:16 AM IST

Updated : Apr 13, 2019, 3:41 PM IST

ETV Bharat / bharat

'జలియన్​వాలా' అమరులకు ఘన నివాళులు

జలియన్​వాలా బాగ్ మారణకాండ మృతులకు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ నివాళులు అర్పించారు. అమృత్​సర్​లోని స్మారక స్థూపానికి పుష్పగుచ్చం సమర్పించారు. బ్రిటిష్​ హైకమిషనర్​ డొమినిక్ అస్కిత్​ అమరులకు శ్రద్ధాంజలి ఘటించారు.

జలియన్​వాలాబాగ్ అమరులకు రాహుల్ నివాళులు

జలియన్​వాలా అమరులకు నివాళులర్పించిన రాహుల్​

జలియన్​వాలాబాగ్​ ఊచకోత ఘటన జరిగి నేటికి శతాబ్దం గడిచింది. ఈ సందర్భంగా అమరులకు నివాళులర్పించారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. అమృత్​సర్​లోని జలియన్​వాలాబాగ్ స్మారక స్థూపానికి పుష్పాంజలి ఘటించారు. రెండు నిమిషాలు మౌనం పాటించారు.

"స్వాతంత్ర్య సాధన కోసం జీవితాలను పణంగా పెట్టిన గొప్ప వ్యక్తుల త్యాగాలను దేశం ఎప్పటికీ మరువదు." అని సందర్శకుల పుస్తకంలో రాశారు రాహుల్.

బ్రిటిష్ హై కమిషనర్ నివాళి

బ్రిటిష్ హై కమిషనర్​ డొమినిక్​ అస్కిత్​ జలియన్ వాలా బాగ్​ మృతులకు స్మారక స్థూపం వద్ద నివాళులర్పించారు.

"100 ఏళ్ల క్రితం నాటి జలియన్​ వాలా బాగ్​ ఘటన భారత్​లో బ్రిటిష్​ పాలనకు మాయని మచ్చ. అప్పుడు జరిగిన ఘటనకు మేం విచారం వ్యక్తం చేస్తున్నాం. ప్రస్తుతం లండన్​, భారత్ పరస్పర సహకారంతో అభివృద్ధి దిశలో ముందుకు సాగుతున్నందుకు సంతోషంగా ఉంది.' అని సందర్శకుల పుస్తకంలో రాశారు అస్కిత్​.

1919, ఏప్రిల్ 13న అమృతసర్​లోని జలియన్ వాలాబాగ్​లో నిరాయుధులైన స్వాతంత్య్రోద్యమకారులపై బ్రిటిష్ దళాలు విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డాయి. తూటాల గాయాలతో పాటు, తొక్కిసలాటలో అనేక మంది భారతీయులు మృతి చెందారు.

ఇదీ చూడండి:'జలియన్​ వాలాబాగ్​' మారణకాండకు వందేళ్లు

Last Updated : Apr 13, 2019, 3:41 PM IST

ABOUT THE AUTHOR

...view details