తెలంగాణ

telangana

ETV Bharat / bharat

తెరుచుకున్న శ్రీనగర్​- లేహ్​ జాతీయ రహదారి

భారీ హిమపాతం కారణంగా గతేడాది డిసెంబర్​లో మూతపడిన శ్రీనగర్​- లేహ్​ జాతీయ రహదారిని భారత ఆర్మీ లెఫ్టినెంట్​ జనరల్​ కేజేఎస్​ ధిల్లాన్ నేడు​ ప్రారంభించారు. రహదారి పునఃప్రారంభానికి తీవ్రంగా శ్రమించిన బృందాలను అభినందించారు. 434 కిలోమీటర్ల పొడవైన ఈ రహదారి కశ్మీర్​ లోయను లద్ధాఖ్​ను కలుపుతోంది.

By

Published : Apr 28, 2019, 7:43 PM IST

తెరుచుకున్న శ్రీనగర్​- లేహ్​ జాతీయ రహదారి

శ్రీనగర్​- లేహ్​ జాతీయ రహదారి

నాలుగు నెలల అనంతరం శ్రీనగర్​- లేహ్​ జాతీయ రహదారి తెరుచుకుంది. భారీ మంచు కురవడం కారణంగా గతేడాది డిసెంబర్​లో మూతపడ్డ రహదారిని భారత ఆర్మీ లెఫ్టినెంట్​ జనరల్​ కేజేఎస్​ ధిల్లాన్​ ప్రారంభించారు. 434 కిలోమీటర్ల పొడవుండే ఈ రహదారి కశ్మీర్​ లోయ, లద్ధాఖ్​ ప్రాంతాలను కలుపుతోంది.

మంచును తొలగించేందుకు తీవ్ర కృషి

ఈ రహదారిలో మంచును తొలగించడానికి ప్రాజెక్ట్​ బీకన్​, ప్రాజెక్ట్​​ విజయక్​ను నిర్వహించారు. మార్చి 5న ఈ ప్రాజెక్ట్​లు మొదలైన ప్రాజెక్టులు... ఈ నెల 14,15న ముగిశాయి.

యంత్రాలు వినియోగించినప్పటికీ కుప్పలు తెప్పలుగా పేరుకుపోయిన మంచును తొలగించడానికి బృందాలు తీవ్రంగా శ్రమించాయి.

రహదారిని ప్రారంభించిన లెఫ్టినెంట్​ జనరల్​ ధిల్లాన్​... రహదారి పునరుద్ధరణకు తీవ్రంగా శ్రమించిన సభ్యులను అభినందించారు. రహదారి అందుబాటులోకి రావడం వల్ల లద్ధాఖ్​ ప్రాంతంలో పర్యటక రంగం మెరుగుపడుతుందన్నారు.

ఇదీ చూడండి: 'ముంబయి నుంచి పైసా తీసుకోలేదు'

ABOUT THE AUTHOR

...view details