తెలంగాణ

telangana

By

Published : Aug 21, 2020, 7:52 PM IST

ETV Bharat / bharat

ఎస్పీ బాలు కోసం శబరిమలలో సంగీత సమర్పణ

ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం కోలుకోవాలని శబరిమల అయ్యప్ప ఆలయంలో పూజలు నిర్వహించారు. ప్రత్యేకంగా ఉషా పూజను నిర్వహించి స్వామివారికి సంగీత సమర్పణ చేసినట్లు ట్రావెన్​కోర్ దేవస్థానం బోర్డు వెల్లడించింది.

Special prayers held for SPB at Sabarimala Ayyappa temple
ఎస్పీ బాలు కోసం శబరిమలలో సంగీత సమర్పణ

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఆరోగ్యం మెరుగుపడాలని కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయంలో పూజలు నిర్వహించారు. స్వామివారికి ప్రత్యేకంగా నిర్వహించే 'ఉషా పూజ'ను బాలు పేరిట చేసినట్లు ట్రావెన్​కోర్ దేవస్థానం బోర్డు వెల్లడించింది.

సంగీతంతో స్వామివారికి పూజలు!

"నాదస్వరం, తబలా వంటి వాయిద్యాలతో స్వామివారి ముందు సంగీత సమర్పణ చేశాం. బాల సుబ్రహ్మణ్యం ఆలపించిన 'శంకరా.. నాద సరీరా' పాటను దేవస్థాన వాయిద్యకారులు స్వామి వారికి వినిపించారు."

-ట్రావెన్​కోర్ దేవస్థానం బోర్డు

కరోనా బారినపడ్డ బాలసుబ్రహ్మణ్యం ప్రస్తుతం చెన్నై ఎంజీఎం హెల్త్​కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమంగా ఉండటం వల్ల ఆయనను వెంటిలేటర్​పై ఉంచారు. ఇంటెన్సివ్ కేర్ యూనిట్​లో ఎక్మో సాయంతో చికిత్స అందిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details