తెలంగాణ

telangana

By

Published : Apr 25, 2020, 8:06 PM IST

ETV Bharat / bharat

రూ.లక్ష కోట్ల ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాలి: సోనియా

సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్​ఎంఈ) రంగం పునరుద్ధరణకు ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా గాంధీ. ఈ రంగాన్ని నిర్లక్ష్యం చేస్తే ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుందని లేఖలో పేర్కొన్నారు సోనియా.

Sonia Gandhi writes to PM Modi; seeks economic package for revival of MSMEs
లక్ష కోట్లు ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాలి: సోనియా

కరోనా ప్రభావం అన్ని రంగాలపై భారీగానే పడింది. ఆర్థిక వ్యవస్థలను నాశనం చేస్తూ.. ప్రపంచ దేశాలను ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేస్తుంది. ఈ నేపథ్యంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల(ఎంఎస్​ఎంఈ) రంగం పునరుద్ధరణకు ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు కాంగ్రెస్​ అధ్యక్షరాలు సోనియా గాంధీ. దీనిని నిర్లక్ష్యం చేస్తే సమస్య చాప కింద నీరులా ప్రవేశించి దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తుందని లేఖలో వివరించారు సోనియా.

"రూ. లక్ష కోట్లు 'ఎంఎస్ఎంఈ వేతన రక్షణ' ప్యాకేజీ ప్రకటించాలి. మరో లక్ష కోట్లకు విలువైన క్రెడిట్​ హామీ నిధిని ఏర్పాటు చేయాలి. సంక్షోభం నుంచి బయటపడేందుకు సలహాలు, సూచనలు ఇవ్వడానికి సహాయక కేంద్రాలను ఏర్పాటు చేయాలి" - సోనియా గాంధీ, కాంగ్రెస్​ అధ్యక్షురాలు.

రోజుకు రూ. 30వేల కోట్లు నష్టం!

లాక్​డౌన్​ కారణంగా ఎంఎస్​ఎంఈలు ప్రతి రోజు రూ. 30వేల కోట్లు నష్టపోతున్నాయని సోనియా పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటి ఈ రంగానికి తప్పని సరిగా సాయం అందించాలన్నారు.

ఇదీ చూడండి:కరోనా కలవరం: దేశంలో 779కి పెరిగిన మరణాలు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details