తెలంగాణ

telangana

By

Published : Apr 9, 2019, 5:51 PM IST

ETV Bharat / bharat

ఏప్రిల్​ 11న సోనియాగాంధీ నామినేషన్​

యూపీఏ ఛైర్​పర్సన్​ సోనియాగాంధీ ఏప్రిల్​ 11న ఉత్తరప్రదేశ్ రాయ్​బరేలీ లోక్​సభ స్థానానికి కాంగ్రెస్​ అభ్యర్థిగా నామపత్రం దాఖలు చేయనున్నారు.​

రాయ్​బరేలీలో ఏప్రిల్​ 11న సోనియాగాంధీ నామినేషన్​

11న నామినేషన్​ వేయనున్న సోనియాగాంధీ

ఉత్తరప్రదేశ్ రాయ్​బరేలీ లోక్​సభ స్థానం నుంచి కాంగ్రెస్​ అభ్యర్థిగా యూపీఏ ఛైర్​పర్సన్​ సోనియా గాంధీ గురువారం నామినేషన్​ వేయనున్నారు. రాయ్​బరేలీలో మే 6న సార్వత్రిక ఎన్నికల ఐదవ దశ పోలింగ్​ జరగనుంది.

2004 నుంచి సోనియాగాంధీ రాయ్​బరేలీ ఎంపీగా ఉన్నారు. 2006 ఉపఎన్నికలు, 2009, 2014 సాధారణ ఎన్నికల్లో ఆమె విజయఢంకా మోగించారు. ప్రస్తుతం ఆమె.. ఇటీవలే కాంగ్రెస్​ నుంచి భాజపా తీర్థం పుచ్చుకున్న దినేష్​ ప్రతాప్​ సింగ్​తో పోటీపడుతున్నారు.

కాంగ్రెస్​కు పోటీగా.. రాయ్​బరేలీలో తమ అభ్యర్థిని నిలపబోమని ఇప్పటికే ఎస్పీ, బీఎస్పీ కూటమి ప్రకటించింది.

1957 నుంచి రాయ్​బరేలీలో 19 సార్లు కాంగ్రెస్​ విజయం సాధించింది. కేవలం 3 సార్లు మాత్రమే (1977, 1996, 1998) ఓటమి చవిచూసింది.

ఇదీ చూడండి: భారత్​ భేరి: సమరానికి సర్వం సిద్ధం

ABOUT THE AUTHOR

...view details