తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వరుసగా నాలుగోసారి సీపీపీ నేతగా సోనియా

కాంగ్రెస్​ పార్లమెంటరీ పార్టీ ఛైర్​పర్సన్​గా మరోమారు సోనియా గాంధీనే ఎన్నికయ్యారు. దిల్లీలో జరిగిన పార్టీ పార్లమెంటరీ భేటీలో పార్టీ నేతలు ఈ నిర్ణయం తీసుకున్నారు. వరుసగా నాలుగో సారి యూపీఏ అధ్యక్షురాలు ఈ బాధ్యతలు నిర్వర్తించనున్నారు.

By

Published : Jun 1, 2019, 11:36 AM IST

Updated : Jun 1, 2019, 3:30 PM IST

సోనియా

వరుసగా నాలుగోసారి సీపీపీ నేతగా సోనియా

పార్లమెంటులో కాంగ్రెస్​ సేనానిగా మరోసారి సోనియా గాంధీనే నియమితులయ్యారు. దిల్లీ పార్లమెంట్​ సెంట్రల్​ హాల్​లో జరిగిన సమావేశంలో కాంగ్రెస్​ పార్లమెంటరీ పార్టీ నేతగా సోనియా గాంధీని ఎన్నుకున్నారు ఎంపీలు. సోనియా పేరును మాజీ ప్రధాని మన్మోహన్​ సింగ్ ప్రతిపాదించగా​ సభ్యులు అందరూ ఆమోదం తెలిపారు.

యూపీఏ ఛైర్​పర్సన్​ సోనియా గాంధీ... ప్రస్తుతం ఉత్తర్​ప్రదేశ్​ రాయ్​బరేలీ నియోజకవర్గం నుంచి లోక్​సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2004 నుంచి సోనియా గాంధీ కాంగ్రెస్​ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలిగా ఉన్నారు.

12 కోట్ల 13 లక్షల మంది ఓటర్లు కాంగ్రెస్​ పార్టీపై విశ్వాసం ఉంచినందుకు కృతజ్ఞతలు తెలిపారు సోనియా గాంధీ. ఈ విషయాన్ని ట్విట్టర్​లో పంచుకున్నారు కాంగ్రెస్​ అధికార ప్రతినిధి రణ్​దీప్​ సుర్జేవాలా.

లోక్​సభ ఎన్నికల సమయంలో రాహుల్​ గాంధీ పాత్రను ప్రశంసించారు సోనియా గాంధీ. చైతన్యంతో పార్టీని ముందుకు నడిపించారని కొనియాడారు. 52 మంది ఎంపీలతో ప్రతిపక్ష పాత్రను బాధ్యతాయుతంగా నిర్వర్తిస్తామన్న సోనియా... ప్రజా సమస్యల కోసం పోరాడుతామని వ్యాఖ్యానించారు.

సీపీపీ నేతగా ఎన్నికైనందుకు సోనియా గాంధీకి శుభాకాంక్షలు తెలిపారు కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ. భాజపాపై ప్రతిరోజు పోరాటం చేస్తామని చెప్పారు.

'కాంగ్రెస్​ పార్లమెంటరీ పార్టీ నేతగా ఎన్నికైన సోనియా గాంధీకి శుభాకాంక్షలు. ఆమె నాయకత్వంలో.. రాజ్యాంగ పరిరక్షణ కోసం సమర్థమంతమైన ప్రతిపక్ష పార్టీగా నిరూపించుకుంటాం.'
- రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ అధ్యక్షుడు

Last Updated : Jun 1, 2019, 3:30 PM IST

ABOUT THE AUTHOR

...view details