తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పల్లి పట్టి కొనివ్వలేదని తల్లిని చంపాడు

తమిళనాడులో పల్లిపట్టి కొనివ్వలేదని తల్లిని చంపాడు ఓ ప్రబుద్ధుడు. పూటుగా మద్యం సేవించిన తర్వాత తల్లిని కర్రతో తలపై కొట్టాడు.

By

Published : Jul 31, 2019, 10:27 PM IST

Updated : Jul 31, 2019, 11:56 PM IST

పల్లి పట్టి

పల్లిపట్టి కోసం తల్లి హత్య

తమిళనాడు తిరుచ్చి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పల్లి పట్టి కొనివ్వలేదని తల్లిని కర్రతో తలపై మోది చంపాడు తాగుబోతు కుమారుడు.

శ్రీనివాసన్​, తమిళరాశి దంపతులు జిల్లాలోని ముసిరిలో నివాసం ఉంటున్నారు. వీరి కుమారుడు కన్నదాసన్​ మద్యానికి బానిస. రోజు మద్యం సేవించాక పల్లిపట్టి తినడం అతనికి అలవాటు. బుధవారం పూటుగా మద్యం సేవించిన కన్నదాసన్​ పల్లిపట్టి కొనివ్వాలని తల్లి తమిళరాశిని అడిగాడు.

తాగుబోతు కుమారుడు మద్యం మత్తులో దారుణానికి ఒడిగడుతాడని గ్రహించక గుడికి బయలుదేరింది రాశి. కోపోద్రిక్తుడైన కన్నదాసన్ తల్లిపై కర్రతో బలంగా కొట్టాడు. ఆమె అక్కడికక్కడే మరణించింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ముసిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చూడండి: హైకోర్టు జడ్జిపై సీబీఐ విచారణ.. దేశంలోనే తొలిసారి!

Last Updated : Jul 31, 2019, 11:56 PM IST

ABOUT THE AUTHOR

...view details