తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గుజరాత్​లో పామును కరిచి చంపిన వ్యక్తి..!

గుజరాత్​లో ఓ వ్యక్తి కరవడం వల్ల పాము మృతి చెందింది. ఈ ఘటన అజాన్వ గ్రామంలో జరిగింది. అనంతరం పాము కాటుకు ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

By

Published : May 6, 2019, 11:13 PM IST

గుజరాత్​లో పామును కరిచి చంపిన వ్యక్తి!

'పాము కాటుకు మనిషి మృతి' అనే వార్తలు తరచూ వింటూనే ఉంటాం. కానీ 'మనిషి కరవడంతో పాము మృతి' అనే వార్త ఎప్పుడైనా విన్నారా? అసలు ఇది సాధ్యమే కాదనుకుంటున్నారా? అయితే మీరు పొరబడ్డట్టే....

గుజరాత్​లో శనివారం ఓ విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. ఓ మనిషి కరవడం వల్ల సర్పం మృతి చెందింది. అజాన్వ గ్రామానికి చెందిన పర్వత్​ గాల బరియా అనే వ్యక్తిని పాము కాటేసింది. ఆగ్రహంతో పర్వత్​ పామును కరిచాడు. ఈ ఘటనలో పర్వత్​తో పాటు పాము కూడా మృతి చెందింది.​ ఈ విషయాన్ని గ్రామ సర్పంచి వివరించారు.

"పొలంలో మొక్కజొన్నను లారీలోకి ఎక్కిస్తోన్న సమయంలో ఓ పాము బుసలు కొడుతూ అటువైపు వచ్చింది. అందరం పరిగెత్తాం. కానీ పర్వత్​ అక్కడే ఉండిపోయాడు. పాములను పట్టుకోవడం తనకు అలవాటే అని అన్నాడు. ఆ సర్పం పర్వత్​ ముఖంపై, చేతిపై కాటేసింది. పర్వత్​ కూడా పామును కరిచాడు."
- కను బరియా, సర్పంచ్​

స్థానికులు పర్వత్​ను సమీప ఆసుపత్రికి తరలించారు. అనంతరం గోద్రాలోని పెద్దాసుపత్రికీ తీసుకెళ్లారు. కానీ ఫలితం దక్కలేదు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చూడండి: ఐఐటీ మద్రాస్​ సెమిస్టర్​ పరీక్షలో ధోనీపై ప్రశ్న

ABOUT THE AUTHOR

...view details