తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అమేఠీలో నామినేషన్​ వేసిన స్మృతి ఇరానీ

కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఉత్తర్​ప్రదేశ్​లోని అమేఠీ లోక్​సభ స్థానానికి నామపత్రం​ దాఖలు చేశారు. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, భాజపా సీనియర్ నాయకుల సమక్షంలో నామినేషన్ సమర్పించారు.

By

Published : Apr 11, 2019, 3:00 PM IST

Updated : Apr 11, 2019, 6:59 PM IST

స్మృతి ఇరానీ

ఉత్తర్​ప్రదేశ్​లోని అమేఠీ లోక్​సభ స్థానానికి కేంద్ర మంత్రి, భాజపా నాయకురాలు స్మృతి ఇరానీ నామపత్రం దాఖలు చేశారు. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​​, భాజపా సీనియర్​ నాయకులతో కలిసి ర్యాలీగా అమేఠీ పరిపాలనా కార్యాలయానికి చేరుకున్నారు ఇరానీ.

తొలుత ఈ నెల 17న నామపత్రం దాఖలు చేయాలని నిర్ణయించినప్పటికీ... మహవీర్​ జయంతి సందర్భంగా నామినేషన్​ తేదీని మార్చుకున్నారు.

కాంగ్రెస్​ పార్టీ కంచుకోట అయిన అమేఠీలో మరోమారు కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ గాంధీతో పోటీపడనున్నారు స్మృతి. 2014లో జరిగిన లోక్​సభ ఎన్నికల్లో స్మృతి ఇరానీపై రాహుల్​ గాంధీ లక్ష ఓట్లకు పైగా మెజారిటీ సాధించి విజయం సాధించారు. సాధారణ ఎన్నికల్లో భాగంగా ఐదవ దశలో మే 6న అమేఠీ స్థానానికి పోలింగ్​ జరగనుంది.

ఇదీ చూడండి:రాయ్​బరేలీ నుంచి సోనియా గాంధీ నామినేషన్

Last Updated : Apr 11, 2019, 6:59 PM IST

ABOUT THE AUTHOR

...view details