తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జమ్ముకశ్మీర్​లో 'హింస' అవాస్తవం: డీజీపీ

జమ్ముకశ్మీర్‌లో వారం రోజులుగా పరిస్థితులు ప్రశాంతంగానే ఉన్నాయని పోలీసు అధికారులు తెలిపారు. జమ్ముకశ్మీర్‌, లద్దాఖ్​లలో హింస చెలరేగుతోందన్న రాహుల్ వ్యాఖ్యలపై స్పందించారు డీజీపీ దిల్‌బాగ్ సింగ్. స్థానికంగా అలాంటి ఘటనలేవీ చోటుచేసుకోలేదని స్పష్టం చేశారు. తప్పుడు సమాచారాన్ని నమ్మరాదని సూచించారు.

By

Published : Aug 11, 2019, 5:41 AM IST

Updated : Aug 11, 2019, 6:53 AM IST

జమ్ముకశ్మీర్​లో 'హింస' అవాస్తవం: డీజీపీ

జమ్ముకశ్మీర్​లో 'హింస' అవాస్తవం: డీజీపీ

జమ్ముకశ్మీర్​, లద్దాఖ్​లో హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయని వస్తున్న ఊహాగానాలపై స్పందించారు ఆ ప్రాంత డీజీపీ దిల్​బాల్​ సింగ్​. జమ్మూలో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని.. రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను తోసిపుచ్చారు డీజీపీ. ఈ వార్తలు అవాస్తవమని స్పష్టం చేశారు.

వారం రోజులుగా కశ్మీర్​లో పరిస్థితులు ప్రశాంతంగా ఉన్నాయని చెప్పారు. తప్పుడు ప్రచారాలను నమ్మరాదని ప్రజలకు సూచించారు సింగ్. శ్రీనగర్‌లోనూ పరిస్థితి ప్రశాంతంగానే ఉందని కశ్మీర్​ ఐజీపీ.. స్వయం ప్రకాశ్​ వీడియో ద్వారా తెలిపారు.

"కశ్మీర్‌ లోయలో కాల్పులు జరిగినట్లు అంతర్జాతీయ మీడియా చెప్పింది. ఆ ప్రచారం అవాస్తవం. లోయలో అలాంటి ఘటనలేవీ జరగలేదు. వారం రోజులుగా జమ్మూ చాలా ప్రశాంతంగా ఉంది."

-స్వయం ప్రకాశ్​, కశ్మీర్ ఐజీపీ.

Last Updated : Aug 11, 2019, 6:53 AM IST

ABOUT THE AUTHOR

...view details