తెలంగాణ

telangana

ETV Bharat / bharat

32 ఏళ్ల తర్వాత కలుసుకున్న అక్కాచెల్లెళ్లు

చిన్నప్పుడే విడిపోయిన తన కుటుంబం గురించి తెలుసుకునేందుకు 32 ఏళ్ల స్వీడన్​ మహిళ చేసిన ప్రయత్నం ఫలించింది. తన తల్లి చనిపోయింది. అయితే మహారాష్ట్ర పుణెలో ఉంటున్న ఆమె సోదరి జాడ తెలుసుకుంది. ఒకరినొకరు చూసిన క్షణంలో హత్తుకుని ఆనంద బాష్పాలు రాల్చారు.

By

Published : May 31, 2019, 7:33 AM IST

అక్కాచెల్లెళ్లు

అక్కాచెల్లెళ్ల కలయిక

నేహ హాలంగ్రామ్​.... 32 ఏళ్ల క్రితం మహారాష్ట్ర బుధవార్​పేట్​లో తన కుటుంబం నుంచి దూరమైంది. ఆమె ఇప్పుడు స్వీడన్​ మహిళ. చిన్నప్పుడే స్వీడన్​ దంపతులు దత్తత తీసుకున్నారు. అనేక ఏళ్ల తర్వాత విషయం తెలుసుకున్న నేహ తన కుటుంబాన్ని కలుసుకోవాలని చేసిన ప్రయత్నాలు చివరకు ఫలించాయి. తల్లి చనిపోయినా సోదరి పుణెలో ఉందని తెలిసి భారత్​కు పరుగున వచ్చింది.

32 ఏళ్ల క్రితం జన్మించిన నేహను శ్రీవత్స బాలల సంక్షేమ కేంద్రానికి అప్పగించారు. 14 నెలల వయసులో నేహను ఓ స్వీడన్ కుటుంబం దత్తత తీసుకుంది. అప్పటినుంచి మళ్లీ భారత్​కు తిరిగిరాలేదు ఆమె. 10 ఏళ్ల క్రితం తన నేపథ్యం గురించి తెలుసుకున్న నేహ.. కుటుంబం కోసం వెతకడం ప్రారంభించింది.

ఈ విషయం తన భర్తతో చెప్పుకుని వెతికేందుకు అతడ్ని భారత్​కు పంపింది. దత్తత పత్రాల్లో కుటుంబం, పుట్టిన స్థలం సంబంధించిన వివరాల సాయంతో వెతికాడు నేహ భర్త. కొన్ని సంస్థల సహకారంతో తల్లి చనిపోయిందని, సోదరి ఉన్నట్టు తెలుసుకున్నాడు. పుణె వ్యభిచార కూపంలో చిక్కుకున్న నేహ సోదరిని 'కాయకల్ప' సంస్థ ద్వారా చేరుకున్నాడు.

ఈ వార్త వినగానే స్వీడన్​ నుంచి వచ్చింది నేహ. సోదరిని కలుసుకుని మనసారా హత్తుకుంది. అయితే అధికారికంగా డీఎన్​ఏ పరీక్షలు నిర్వహించి వైద్య పరంగా నిర్ధరించిన తర్వాతే అప్పగిస్తామని కాయకల్ప సంస్థ తెలిపింది. పరీక్షల తర్వాత ఇద్దరమూ కలిసి జీవిస్తామని తెలిపింది నేహ.

ఇదీ చూడండి: లైవ్​ వీడియో: విష సర్పంతో కుక్కల ఫైట్​

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details