తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అందరి​కన్నా ముందే ఓటేసిన జవాన్లు​..!

17వ లోక్​సభ ఎన్నికల్లో దేశ ప్రజలందరి కంటే ముందే 80 మంది 'సర్వీస్ ఓటర్లు' ఓటుహక్కు వినియోగించుకున్నారు. వీళ్లంతా అరుణాచల్ ప్రదేశ్​లోని లోహిత్​పూర్​లో శుక్రవారం ప్రత్యేకంగా నిర్వహించిన పోలింగ్​లో పాల్గొన్నారు. ఈ బ్యాలెట్​ పత్రాలను లెక్కింపు కోసం ఓటర్ల సొంత జిల్లాలకు పంపనున్నారు అధికారులు.

By

Published : Apr 7, 2019, 4:46 PM IST

పోలింగ్​కన్నా ముందే ఓటేసిన జవాన్లు

పోలింగ్​కన్నా ముందే ఓటేసిన జవాన్లు

ఈ నెల 11న ప్రారంభం కావాల్సిన ఓట్ల పండుగ 6 రోజులు ముందుగానే మొదలైంది. ఇతర రాష్ట్రాల్లో విధులు నిర్వర్తిస్తున్న పోలీసులు, సైనికులు, విదేశాల్లో పనిచేసే అధికారులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన ప్రత్యేక సేవే 'సర్వీస్​ ఓటర్'. ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారు ఇండో-టిబెట్​ సరిహద్దులోని 80 మంది ఐటీబీపీ జవాన్లు.

అరుణాచల్​ ప్రదేశ్​లోని లోహిత్​పూర్​లో సర్వీస్ ఓటర్ల కోసం ప్రత్యేకంగా నిర్వహించిన 17వ లోక్​సభ ఎన్నికల పోలింగ్​లో వీరందరూ పాల్గొన్నారు.

ఉత్తరాఖండ్​, గుజరాత్​, కర్ణాటక, బిహార్​, రాజస్థాన్​, హరియాణా, ఉత్తరప్రదేశ్​ రాష్ట్రాలకు చెందిన సర్వీస్​ ఓటర్లు ఈ పోలింగ్​లో పాల్గొన్నారు. సరిహద్దు ​జంతు శిక్షణా కేంద్రం అధికారులు, ఇతర దౌత్య అధికారులు కూడా ఓటుహక్కు వినియోగించుకున్నారు. మే 23న జరగనున్న లెక్కింపు కోసం బ్యాలెట్​ పత్రాలను ఓటర్ల సొంత నియోజకవర్గాలకు పంపనున్నారు అధికారులు.

గతంతో పోలిస్తే పెరిగిన ఓటర్లు

2014తో పోలిస్తే 2019లో సర్వీస్​ ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరిగిందని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. ఈ ఏడాది 16,62,993 మంది సర్వీస్​ ఓటర్ల కింద నమోదు చేసుకున్నారని ప్రకటించారు.

ABOUT THE AUTHOR

...view details