తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'సంఝౌతా' పేలుడు కేసులో నిర్దోషిగా అసిమానంద

సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌  పేలుడు కేసులో హరియాణా పంచకులలోని ప్రత్యేక ఎన్​ఐఏ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. స్వామి అసిమానంద సహా నలుగురు నిందితులను నిర్దోషులుగా తేల్చింది.

By

Published : Mar 20, 2019, 9:54 PM IST

Updated : Mar 21, 2019, 6:03 AM IST

సంఝౌతా ఎక్స్​ప్రెస్​ పేలుడు కేసులో తీర్పు

సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ పేలుడు కేసులో స్వామి అసిమానంద సహా నలుగురు నిందితులను నిర్దోషులుగా తేల్చింది పంచకులలోని ప్రత్యేక ఎన్​ఐఏ న్యాయస్థానం.

2007 ఫిబ్రవరి 18వ తేదీన జరిగిన సంఝౌతా పేలుడులో 68 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఎక్కువ మంది పాకిస్థాన్​ వాసులే ఉన్నారు. సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ భారత్‌ నుంచి పాకిస్థాన్‌ వెళ్తుండగా పానిపట్‌ వద్ద ఈ ఘటన జరిగింది.

ఈ కేసుకు సంబంధించి ఎన్​ఐఏ 8 మందిని ఎఫ్​ఐర్​లో నిందితులుగా చేర్చింది. అయితే న్యాయస్థానం ముందు మాత్రం నలుగురునే ప్రవేశపెట్టింది. వీరిలో స్వామి అసిమానందతో పాటు లోకేష్‌ శర్మ, కమల్‌ చౌహాన్‌, రాజేందర్‌ చౌదరి ఉన్నారు. వీరందరినీ కోర్టు నిర్దోషులుగా తేల్చింది. 2010 వరకు ఈ కేసును సిట్‌ విచారించింది. ఆ తర్వాత ఎన్​ఐఏ చేతికి వచ్చింది.

Last Updated : Mar 21, 2019, 6:03 AM IST

ABOUT THE AUTHOR

...view details