తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'అయోధ్య కేసులో సుప్రీం రోజువారీ విచారణే సరి'

అయోధ్య కేసులో సుప్రీం కోర్టు తాజా తీర్పును రాష్ట్రీయ స్వయం సేవక్​ సంఘ్ స్వాగతించింది. రోజువారీ విచారణ చేపడితే రామమందిర నిర్మాణానికి త్వరలోనే అడ్డంకులు తొలిగిపోతాయని ఆశాభావం వ్యక్తం చేసింది.

By

Published : Aug 2, 2019, 7:40 PM IST

అయోధ్య తీర్పు

అయోధ్య కేసులో రోజువారీ విచారణ చేపడతామన్న సుప్రీం తీర్పును రాష్ట్రీయ స్వయం సేవక్​ సంఘ్​ స్వాగతించింది. ఈ నిర్ణయంతో అయోధ్యలో రామమందిర నిర్మాణానికి అడ్డంకులు త్వరలోనే తొలగుతాయని అభిప్రాయపడింది.

ఆర్​ఎస్​ఎస్​ ట్వీట్

అయోధ్య కేసులో మధ్యవర్తిత్వ కమిటీ జులై 31న సమర్పించిన నివేదికపై నేడు సుప్రీం విచారణ చేపట్టింది. రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాద పరిష్కారంలో మధ్యవర్తిత్వ కమిటీ ఎలాంటి ఫలితం ఇవ్వలేదని న్యాయస్థానం అభిప్రాయపడింది. ఈ కేసులో ఈ నెల 6వ తేదీ నుంచి రోజువారీ విచారణ కొనసాగిస్తామని తెలిపింది.

ఇదీ చూడండి: ఆగస్టు 6 నుంచి అయోధ్యపై రోజువారీ విచారణ

ABOUT THE AUTHOR

...view details