తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ప్రజల విరాళాలతోనే అయోధ్య రామ మందిర నిర్మాణం'

అయోధ్యలో రామ మందిర నిర్మాణ ట్రస్ట్​ ఏర్పాటుపై విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రధానంగా అయోధ్య ట్రస్టు రాజకీయాలకు అతీతంగా ఉండాలని సూచించారు వీహెచ్​పీ ప్రధాన కార్యదర్శి మిలింద్​ పరాండే. ఆలయాన్ని ప్రభుత్వ ధనంతోకాక, ప్రజల విరాళాలతో నిర్మించాలని అభిప్రాయపడ్డారు. ఈ విషయంపై 'ఈటీవీ భారత్'తో ప్రత్యేకంగా మాట్లాడారు.

By

Published : Jan 26, 2020, 2:05 PM IST

Updated : Feb 25, 2020, 4:24 PM IST

ram-temple-trust-should-be-apolitical-funds-should-not-come-from-exchequer-vhp
అయోధ్య ట్రస్టు రాజకీయాలకతీతంగా ఉండాలి: వీహెచ్​పీ

అయోధ్యలో రామ మందిర నిర్మాణ ట్రస్ట్​ ఏర్పాటు, నిధుల సమీకరణపై కీలక వ్యాఖ్యలు చేశారు విశ్వ హిందూ పరిషత్​ ప్రధాన కార్యదర్శి మిలింద్​ పరాండే. అయోధ్య ట్రస్ట్​ రాజకీయాలకు అతీతంగా ఉండాలన్నారు. ఆలయ నిర్మాణానికి అవసరమయ్యే నిధులు ప్రభుత్వ ఖజానా నుంచి కాకుండా.. ప్రజల నుంచి సేకరించాలని సూచించారు.

అయోధ్య భూవివాదం కేసుపై తుది తీర్పు వెలువడిన క్రమంలో మూడు నెలల్లోపు ఆలయ నిర్మాణ ట్రస్ట్​ ఏర్పాటు చేయాలని సూచించింది సుప్రీం కోర్టు. కేంద్ర హోంమంత్రి అమిత్​ షా కూడా పలు సభల్లో ఆలయ నిర్మాణం మూడు నెలల్లో ప్రారంభం అవుతుందని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో పలు అంశాలను ఈటీవీ భారత్​తో పంచుకున్నారు వీహెచ్​పీ ప్రధాన కార్యదర్శి మిలింద్​ పరాండే. ప్రభుత్వం.. అయోధ్య రామ మందిరాన్ని త్వరగా ప్రారంభించాలని కోరారు.

అయోధ్య ట్రస్టు రాజకీయాలకతీతంగా ఉండాలి: వీహెచ్​పీ

" సుప్రీంకోర్టు ఆదేశాలను కేంద్ర ప్రభుత్వం పాటిస్తుంది. అందుకు ఇచ్చిన 3 నెలల గడువు ఇంకా పూర్తి కాలేదు. అయోధ్య ఆందోళనల్లో పాల్గొన్నవారు కేంద్ర ప్రభుత్వంలో చాలామంది ఉన్నారు. వాళ్లు విచారించి సుప్రీంకోర్టు నిర్ణయాన్ని అమలు చేస్తారు. సర్కారు ఏర్పాటు చేసినంత మాత్రాన ఆ ట్రస్ట్​.. ప్రభుత్వానిది కానీ రాజకీయపరమైనది కానీ కావద్దు. నిర్మాణ ఖర్చు కూడా ప్రభుత్వం భరించకూడదు. సమాజమే ఆలయ నిర్మాణానికి ముందుకురావాలి."

-మిలింద్​ పరాండే, వీహెచ్​పీ ప్రధాన కార్యదర్శి

Last Updated : Feb 25, 2020, 4:24 PM IST

ABOUT THE AUTHOR

...view details