తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రక్షణమంత్రి ఇంటిముందు ధర్నా

రఫేల్​ ఒప్పంద పత్రాలు చోరీకి గురయ్యాయని కేంద్రం సుప్రీంకోర్టుకు చెప్పడంపై సర్వత్రా విమర్శలు ఎదురవుతున్నాయి. తాజాగా.. దిల్లీలోని రక్షణమంత్రి నిర్మలా సీతారామన్​ నివాసం ముందు కాంగ్రెస్​ యూత్​ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు.

By

Published : Mar 8, 2019, 8:00 AM IST

రక్షణమంత్రి ఇంటిముందు ధర్నా

రక్షణమంత్రి ఇంటిముందు ధర్నా

రఫేల్​ ఒప్పంద పత్రాలు చోరీకి గురయ్యాయని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలపటంపై కాంగ్రెస్​ తీవ్ర విమర్శలు చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ తాను చేసిన నేరాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది. తాజాగా దిల్లీ యూత్​ కాంగ్రెస్​ కార్యకర్తలు హస్తినలోని రక్షణమంత్రి నిర్మలా సీతారామన్​ నివాసం ముందు ధర్నాకు దిగారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ... మోదీ రాజీనామా చేయాలని డిమాండ్​ చేశారు.

అడ్డుకున్న పోలీసులు

రక్షణమంత్రి ఇంటి ముందు ఆందోళనలు చేస్తున్న కార్యకర్తల్ని పోలీసులు అడ్డుకున్నారు. బారికేడ్లు దాటి ముందుకు సాగాలని చూసిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

రఫేల్​ పత్రాలు చోరీ...

రఫేల్‌ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందానికి సంబంధించిన పత్రాలు పోయాయని, రక్షణశాఖ నుంచి ఇవి చోరీకి గురయ్యాయని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం బుధవారమే నివేదించింది.

ABOUT THE AUTHOR

...view details