తెలంగాణ

telangana

By

Published : Oct 31, 2019, 5:52 PM IST

ETV Bharat / bharat

నిర్మలా సీతారామన్ విమర్శలను తిప్పికొట్టిన రాజన్

భారత బ్యాంకింగ్ రంగం తన హయాంలోనే కుదేలైందని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్​ చేసిన విమర్శలను ఆర్​బీఐ మాజీ గవర్నర్ రఘురామ్​ రాజన్ తిప్పికొట్టారు. కేంద్ర బ్యాంకు గవర్నర్​గా భాజపా హయాంలోనే తాను ఎక్కువకాలం పనిచేశానని రాజన్ గుర్తు చేశారు. ఆర్థిక మందగమనాన్ని అడ్డుకోవడానికి భాజపా సంస్కరణలు చేపట్టాలని సూచించారు.

'నిర్మలా సీతారామన్ విమర్శలను తిప్పికొట్టిన రాజన్'

నిర్మలా సీతారామన్ విమర్శలను తిప్పికొట్టిన రాజన్

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్​ తనపై చేసిన విమర్శలకు ఆర్​బీఐ మాజీ గవర్నర్ రఘురామ్​ రాజన్​ ఘాటుగా స్పందించారు. భాజపా ప్రభుత్వ హయాంలోనే... కేంద్ర బ్యాంకు అధిపతిగా తన పదవి కాలంలో మూడింట రెండువంతులు పనిచేసినట్లు ఆయన గుర్తు చేశారు. అయితే ఈ అంశంపై రాజకీయ విమర్శలకు దిగబోనని ఆయన స్పష్టం చేశారు.

"నేను కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కేవలం 8 నెలలు మాత్రమే ఆర్​బీఐ గవర్నర్​గా ఉన్నాను. భాజపా హయాంలో 26 నెలలు సేవలందించాను. అంటే భాజపా హయాంలోనే నేను ఎక్కువ కాలం పనిచేశాను.2013 సెప్టెంబర్ 5 నుంచి 2016 సెప్టెంబర్​ వరకు ఆర్​బీఐ గవర్నర్​గా నేను ఉన్నాను. అప్పుడే బ్యాంకింగ్ రంగ ప్రక్షాళన చేపట్టాం. అయితే అది ఇంకా పూర్తికాలేదు. మీరు (భాజపా) బలమైన వృద్ధిని కోరుకుంటే ఆర్థిక వ్యవస్థ ప్రక్షాళన చేపట్టండి."

- రఘురామ్ రాజన్, ఆర్​బీఐ మాజీ గవర్నర్​

ఈ నెల ప్రారంభంలో నిర్మలా సీతారామన్ న్యూయార్క్​లో మాట్లాడుతూ మాజీ ప్రధాని మన్మోహన్​సింగ్, ఆర్​బీఐ మాజీ గవర్నర్​ రఘురామ్​ రాజన్​పై తీవ్ర విమర్శలు చేశారు. వారి హయాంలోనే భారత బ్యాంకింగ్ రంగం అధోగతి పాలయిందని, అదో 'చెత్త దశ' అని పేర్కొన్నారు.

సంస్కరణలు కావాలి

దేశ ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడానికి సరికొత్త సంస్కరణలు అవసరమని రాజన్ పేర్కొన్నారు. 5 శాతం జీడీపీ వృద్ధిరేటుతో భారత్​ గణనీయమైన ఆర్థిక మందగమనాన్ని ఎదుర్కొంటోందని అభిప్రాయపడ్డారు.

ఇదీ చూడండి:'రాహుల్​ విదేశీ పర్యటనల వెనుక మర్మం ఏంటో?'​



For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details