కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తనపై చేసిన విమర్శలకు ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ ఘాటుగా స్పందించారు. భాజపా ప్రభుత్వ హయాంలోనే... కేంద్ర బ్యాంకు అధిపతిగా తన పదవి కాలంలో మూడింట రెండువంతులు పనిచేసినట్లు ఆయన గుర్తు చేశారు. అయితే ఈ అంశంపై రాజకీయ విమర్శలకు దిగబోనని ఆయన స్పష్టం చేశారు.
"నేను కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కేవలం 8 నెలలు మాత్రమే ఆర్బీఐ గవర్నర్గా ఉన్నాను. భాజపా హయాంలో 26 నెలలు సేవలందించాను. అంటే భాజపా హయాంలోనే నేను ఎక్కువ కాలం పనిచేశాను.2013 సెప్టెంబర్ 5 నుంచి 2016 సెప్టెంబర్ వరకు ఆర్బీఐ గవర్నర్గా నేను ఉన్నాను. అప్పుడే బ్యాంకింగ్ రంగ ప్రక్షాళన చేపట్టాం. అయితే అది ఇంకా పూర్తికాలేదు. మీరు (భాజపా) బలమైన వృద్ధిని కోరుకుంటే ఆర్థిక వ్యవస్థ ప్రక్షాళన చేపట్టండి."
- రఘురామ్ రాజన్, ఆర్బీఐ మాజీ గవర్నర్