తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'పేదల్ని దోచి పెద్దలకు పెట్టడమే ప్రధాని పని'

జార్ఖండ్​లోని చాయ్​బస ఎన్నికల ప్రచారంలో రాహుల్​ గాంధీ పాల్గొన్నారు. ఆదివాసీలకు కాంగ్రెస్​ ఎల్లప్పుడు అండగా నిలుస్తుందన్నారు. గిరిజనుల భూములను మోదీ ధనిక వ్యాపారులకు దోచిపెడుతున్నారని ఆరోపించారు రాహుల్​.

By

Published : May 7, 2019, 3:35 PM IST

'పేదల్ని దోచి పెద్దలకు పెట్టడమే ప్రధాని పని'

భాజపా పాలనలో ఆదివాసీలకు అన్యాయం జరిగిందని కాంగ్రెస్​ పార్టీ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ ఆరోపించారు. జార్ఖండ్​లోని చాయ్​బసలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు రాహుల్​. కాంగ్రెస్​ అధికారంలోకి వస్తే గిరిజనుల వనరులను సంరక్షిస్తామని హామీ ఇచ్చారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు రాహుల్​. ఆదివాసీల సొమ్మును మోదీ తీసుకుని... ధనిక వ్యాపారుల చేతిలో పెట్టారని విమర్శించారు.

ప్రధానిపై రాహుల్​ విమర్శలు

"ఒక్కసారి మీ జేబులోంచి పర్సు తీసి చూసుకుంటే మీకే అర్థమవుతుంది. మీ పర్సుల నుంచి డబ్బులను ప్రధాని మోదీ తీసుకున్నారు. మీ అడవులు, నీళ్లు, భూమిని సరిగా చూడండి. మీకే అర్థమవుతుంది. మీ నీళ్లను, అడువులను, భూములను అనిల్​ అంబానీకి ప్రధాని ఇచ్చారు."
--- రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ అధ్యక్షుడు.

గిరిజనుల నీరు, అడవి, భూమిని కాపాడడం కాంగ్రెస్​కు మాత్రమే సాధ్యమని అన్నారు రాహుల్​.

ఇదీ చూడండి:'ఓటు స్లిప్పుల' లెక్కపై రివ్యూ పిటిషన్​ కొట్టివేత

ABOUT THE AUTHOR

...view details