తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రాహుల్​ చుట్టూ 'పరువు' కేసులు- సమన్లు జారీ

కాంగ్రెస్​ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి గుజరాత్​లోని వేర్వేరు కోర్టులు సమన్లు జారీ చేశాయి. కేంద్ర హోంమంత్రి అమిత్​ షాపై హత్యారోపణలున్నాయని రాహుల్ చేసిన వ్యాఖ్యలపై పరువు నష్టం దావా వేశారు భాజపా నేతలు.

By

Published : Jul 10, 2019, 5:50 AM IST

రాహుల్ గాంధీకి గుజరాత్​ కోర్టులు సమన్లు

ఇప్పటికే వివిధ కేసుల్లో కోర్టుల చుట్టూ తిరుగుతున్న కాంగ్రెస్​ మాజీ అధ్యక్షుడు రాహుల్​ గాంధీకి మరిన్ని కష్టాలు ఎదురయ్యాయి. గుజరాత్​లోని రెండు కోర్టులు రాహుల్​కు సమన్లు జారీ చేశాయి. కేంద్ర హోంమంత్రి అమిత్​ షాపై హత్య ఆరోపణలున్నాయని రాహుల్ చేసిన వ్యాఖ్యలపై పరువు నష్టం దావా వేశారు భాజపా నేతలు. ఆగస్టు 9న కోర్టు ఎదుట హాజరుకావాలని అహ్మదాబాద్​లోని న్యాయస్థానం ఆదేశించింది.

'మోదీ' పేరుపై సార్వత్రిక ఎన్నికల సమయంలో రాహుల్​ చేసిన వ్యాఖ్యలపై సూరత్​ కోర్టును ఆశ్రయించారు భాజపా ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ. తమ మనోభావాలు దెబ్బతినేలా రాహుల్​ వ్యాఖ్యానించారని మంగళవారం కోర్టులో విచారణ సమయంలో పూర్ణేశ్​ తెలిపారు. ఈ కేసుకు సంబంధించి జులై 16న విచారణకు హాజరు కావాలని రాహుల్​ను ఆదేశించారు సూరత్​లోని చీఫ్​ జ్యుడీషియల్​ మెజిస్ట్రేట్.

కాంగ్రెస్​ మాజీ అధ్యక్షుడిపై ఇప్పటికే పలు పరువు నష్టం కేసులు నమోదయ్యాయి. గతవారం ముంబయి, పట్నా కోర్టుల ఎదుట విచారణకు హజర్యయ్యారు. ఆ తర్వాత రాహుల్​కు బెయిల్ మంజూరు అయ్యింది.

ఇదీ చూడండి: 8 నెలలుగా చెట్టుకు వేలాడుతున్న శవం!

ABOUT THE AUTHOR

...view details