తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పరువు నష్టం కేసులో రాహుల్​కు ఊరట

పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్​ గాంధీకి గుజరాత్​లోని​ సూరత్​ కోర్టు ఊరటనిచ్చింది. మోదీ ఇంటి పేరుపై రాహుల్ చేసిన వ్యాఖ్యల కేసులో వ్యక్తిగత హాజరు నుంచి విముక్తి కల్పించింది న్యాయస్థానం.

By

Published : Jul 16, 2019, 9:45 PM IST

Updated : Jul 17, 2019, 12:24 AM IST

రాహుల్ గాంధీ

రాహుల్ గాంధీ

పరువు నష్టం కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి గుజరాత్​ సూరత్​ కోర్టు ఊరటనిచ్చింది. కేసు విషయంలో న్యాయస్థానానికి వ్యక్తిగత హాజరు అవసరం లేదని స్పష్టం చేసింది. వ్యక్తిగత కారణాల వల్ల రాహుల్ ఇవాళ హాజరు ​ కాలేరన్న అభ్యర్థనను న్యాయస్థానం అంగీకరించి విచారణను అక్టోబర్​ 10కి వాయిదా వేసింది.

సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా "‘దొంగలందరికీ ఇంటిపేరు మోదీనే ఎందుకు ఉంటుంది?" అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై భాజపా ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ.. రాహుల్​పై పరువు నష్టం కేసు వేశారు. పరిశీలనకు స్వీకరించిన సూరత్​ కోర్టు.. న్యాయస్థానానికి రాహుల్ హాజరు కావాలని గతంలో నోటీసులు పంపింది.

ఇదీ చూడండి: సుప్రీంలో 'కర్ణాటకీయం' రేపటికి వాయిదా!

Last Updated : Jul 17, 2019, 12:24 AM IST

ABOUT THE AUTHOR

...view details