తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కశ్మీర్​లో మూడు వందల ప్రత్యేక టెలిఫోన్లు'

జమ్ముకశ్మీర్​లో మూడు వందల ప్రజా టెలిఫోన్లను ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించింది ప్రభుత్వం. సాధారణ ప్రజానీకం వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న తమ కుటుంబసభ్యులతో మాట్లాడుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

By

Published : Aug 11, 2019, 10:49 PM IST

Updated : Sep 26, 2019, 5:01 PM IST

'కశ్మీర్​లో మూడు వందల ప్రత్యేక టెలిఫోన్లు'

సాధారణ ప్రజానీకం కోసం జమ్ముకశ్మీర్​లో మూడు వందల టెలిఫోన్లను ఏర్పాటు చేస్తోంది ప్రభుత్వం. ఇందుకోసం ప్రత్యేక అధికారులను నియమించింది. స్థానిక ప్రజానీకం వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న తమ కుటుంబసభ్యులతో మాట్లాడుకునేందుకు, జమ్ముకశ్మీర్​లో చదువుకుంటున్న విద్యార్థులు తమ తల్లిదండ్రులతో సంభాషించేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకుంది. గవర్నర్ సత్యపాల్ మాలిక్ ఆదేశాల మేరకు ఈ ప్రత్యేక ఫోన్ల ఏర్పాటుపై అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఇతర రాష్ట్రాల్లో చదువుకుంటూ బక్రీద్​ కోసం కశ్మీర్​కు రావాలనుకుంటున్న స్థానిక యువతీ, యువకులకు సహాయ కార్యక్రమాలు కొనసాగించాలని గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు.

ఇదీ చూడండి: ఈ ప్రత్యేకమైన మేక ఖరీదు రూ. 8 లక్షలు!

Last Updated : Sep 26, 2019, 5:01 PM IST

ABOUT THE AUTHOR

...view details