తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'వీడియో గేమ్​లని సైన్యాన్ని అవమానిస్తారా?'

యూపీఏ హయాంలోని లక్షిత దాడులు వీడియో గేమ్​లు కావచ్చన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ వ్యాఖ్యలపై మండిపడ్డారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. భాజపా మెరుపు దాడుల గురించి చెబితే.. కాంగ్రెస్ 'మీటూ' అంటోందన్న మోదీ వ్యాఖ్యలపైనా రాహుల్ దీటుగా స్పందించారు. మోదీ సైన్యాన్ని అవమానిస్తున్నారని విమర్శించారు.

By

Published : May 4, 2019, 1:08 PM IST

సైన్యాన్ని మోదీ అవమానిస్తున్నారు:రాహుల్

యూపీఏ హయాంలో జరిగిన లక్షిత దాడులు వీడియోగేమ్​లు అయి ఉండవచ్చన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ వ్యాఖ్యలపై స్పందించారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.

సైన్యం దేశం మొత్తానికి చెందిందని... ఏ ఒక్కరికో పరిమితం కాదని అన్నారు. మోదీ జాతీయవాదాన్ని ప్రచారాస్త్రంగా చేసుకోవడం పట్ల పరోక్ష విమర్శలు చేశారు. సైన్యంతో రాజకీయాలు చేయడం తమ విధానం కాదన్నారు రాహుల్. ప్రస్తుతం ప్రతిపక్షాల్ని ఎదుర్కోలేని బలహీన ప్రధానిని చూస్తున్నామన్నారు.

"సైన్యం మోదీ వ్యక్తిగత ఆస్తి కాదు. ప్రధాని త్రివిధ దళాలను ఆయన వ్యక్తిగత ఆస్తిగా భావిస్తున్నారు. యూపీఏ పాలనలో జరిగిన లక్షిత దాడులు వీడియో గేమ్​లని అనటం అంటే.. మోదీ సైన్యాన్ని అవమానించినట్టే. కాంగ్రెస్​ను అవమానించినట్టు కాదు. లక్షిత దాడులు సైన్యం చేసింది. సైన్యం భారతదేశానికి చెందింది. ఏ ఒక్కరి సొత్తో కాదు."
-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు

సైన్యాన్ని మోదీ అవమానిస్తున్నారు:రాహుల్

ఇవీ చూడండి: భాజపా ఓటమి తథ్యం: రాహుల్ గాంధీ

ఉగ్రవాదంపై భాజపా ప్రభుత్వం రాజీ: రాహుల్

ABOUT THE AUTHOR

...view details