ఆన్లైన్ గేమ్ పబ్జీకి మరో ప్రాణం బలైంది. పబ్జీ ఆడలేననే మనస్తాపంతో 14 ఏళ్ల బాలుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన తమిళనాడులో జరిగింది.
పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
కోయంబత్తూర్ జిల్లా సులుర్కు చెందిన 14 ఏళ్ల బాలుడు చెన్నైలో 9వ తరగతి చదువుతున్నాడు. అతడికి తరచూ పబ్జీ ఆడటం అలావాటు. ఈ విషయం గమనించిన తల్లిడండ్రులు ఎక్కువ సేపు గేమ్ ఆడటం మంచిది కాదని హెచ్చరించారు. అయినా వారి మాట లేక్కచేయకుండా పబ్జీకి బానిసైపోయాడు ఆ బాలుడు.