తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఫోన్ల కొనుగోలులో ఆలస్యంపై నీతి ఆయోగ్​ అసంతృప్తి

పిల్లల్లో పోషకాహార లోపాలను నియంత్రించే క్రమంలో మరింత చొరవ చూపాలని అన్ని రాష్ట్రాలను కోరింది నీతి ఆయోగ్​. అంగన్​వాడి కేంద్రాలకు అవసరమైన స్మార్ట్​ఫోన్లు, పరికరాలు సమకూర్చడంలో ఆలస్యం చేయొద్దని సూచించింది.

By

Published : Nov 24, 2019, 2:00 PM IST

ఫోన్ల కొనుగోలులో ఆలస్యంపై నీతి ఆయోగ్​ అసంతృప్తి

జాతీయ పోషకాహార పథకం(ఎన్​ఎన్​ఎమ్​) ద్వారా అంగన్​వాడి కేంద్రాల కోసం స్మార్ట్​ఫోన్​లు, పెరుగుదలను కొలిచే పరికరాలను సమకూర్చడంలో రాష్ట్రాలు మరింత చొరవ చూపాలని నీతి ఆయోగ్​ సూచించింది. ప్రస్తుతం అవసరమైనంత స్థాయిలో కొనుగోళ్లు జరగడంలేదని అసంతృప్తి వ్యక్తంచేసింది.

దేశంలోని అంగన్​వాడి కేంద్రాల్లో ప్రస్తుతం 6.28 లక్షల చరవాణిలు, 6.37 లక్షల వృద్ధి పర్యవేక్షణ పరికరాలు అందుబాటులో ఉన్నాయి. అయితే ఐదు రాష్ట్రాల్లోని అంగన్​వాడి కేంద్రాల్లో ఇప్పటికీ స్మార్ట్​ఫోన్స్​ అందుబాటులో లేవని, మరో 14 రాష్ట్రాల్లో అవసరమైన పరికరాలు కూడా సమకూర్చలేదని గత నెల జరిగిన సమావేశంలో నీతి ఆయోగ్​ వైస్​ ఛైర్మన్​ రాజీవ్​ కుమార్ వెల్లడించారు.

"సదుపాయాల కల్పన ఆలస్యమైతే అంగన్​వాడి కేంద్రాలు మనకు కావలసిన ఫలితాలను అందించలేకపోవచ్చు. తీవ్రమైన పోషకాహార లోపం ఉన్న పిల్లలను కూడా వారు గుర్తించలేకపోవచ్చు."

-రాజీవ్​ కుమార్​, నీతి ఆయోగ్​ వైస్​ ఛైర్మన్​

పిల్లల్లో పోషకాహార లోపం, రక్తహీనత, తక్కువ బరువుతో పుట్టడం వంటి సమస్యలను అధిగమించే లక్ష్యంతో 'జాతీయ పోషకాహార మిషన్'​ ప్రారంభించింది కేంద్రం. ఈ మిషన్​ కింద అంగన్​వాడి కేంద్రాలకు స్మార్ట్​ఫోన్స్​, ఔషధాలను అందిస్తోంది.

జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే(ఎన్​ఎఫ్​హెచ్​ఎస్​) ప్రకారం ప్రస్తుతం దేశంలో 38.4 శాతం పిల్లలు పోషకాహార లోపంతో బాధపడుతన్నారు. 2022 నాటికి 25 శాతానికి తగ్గించాలని మిషన్​ ముఖ్య ఉద్దేశం.

అంగన్​వాడి ఉద్యోగులకు శిక్షణ, సామర్థ్యం మరింత పెంపొందించాల్సిన అవసరం ఉందని కుమార్ తెలిపారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించాల్సిన ఉందని అన్నారు.

ఇదీ చదవండి:సైకిల్, ఈ-కార్​, మాస్క్​తో ఎంపీల 'ప్రకృతి ప్రేమ'

ABOUT THE AUTHOR

...view details