తెలంగాణ

telangana

'కరోనా వేళ జైలు గోడలే మాకు శ్రీరామ రక్ష'

By

Published : Apr 9, 2020, 12:44 PM IST

Updated : Apr 9, 2020, 1:31 PM IST

జైల్లో ఉండాలని ఎవరూ కోరుకోరు. ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో వెళ్లాల్సి వచ్చినా.. బయటకు వచ్చేందుకు శతవిధాలా ప్రయత్నిస్తారు. కానీ, గుజరాత్​కు చెందిన ఇద్దరు ఖైదీలు.. ఇందుకు పూర్తి భిన్నం. కోర్టు కనికరించి విడుదల చేసినా వారు మాత్రం జైలు విడిచి వెళ్లేది లేదంటున్నారు.

Prisoners prefer to remain in jail than be released due to coronavirus scare
'కరోనా వేళ జైలు గోడలే మాకు శ్రీరామ రక్ష'

కరోనా మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో జైళ్లలోని ఖైదీలను విడుదల చేస్తున్నాయి ప్రభుత్వాలు. అయితే.. జైలు గోడలే తమకు శ్రీరామ రక్ష అంటున్నారు గుజరాత్​కు చెందిన ఇద్దరు ఖైదీలు. బయటకు వెళ్లేందుకు అనుమతించినా.. ఇక్కడే ఉంటామని పట్టుబడుతున్నారు.

'కరోనా వేళ జైలు గోడలే మాకు శ్రీరామ రక్ష'

​కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఏడేళ్ల కంటే తక్కువ శిక్షను అనుభవిస్తున్న ఖైదీలను విడుదల చేయాలని దిగువ కోర్టులను ఆదేశించింది సుప్రీం కోర్టు. ఈ మేరకు.. నర్మదా జిల్లా, రాజ్​పీప్లా కారాగారాల్లో శిక్ష అనుభవిస్తున్న 177 మందిలో 22 మంది ఖైదీలను విడుదల చేయాలని ఆదేశించింది స్థానిక కోర్టు.

'కరోనా వేళ జైలు గోడలే మాకు శ్రీరామ రక్ష'

విడుదలైన 20 మంది ఇంటికి వెళ్తున్నామని ఆనందంగా ఎగిరి గంతేస్తే.. ఓ ఇద్దరు ఖైదీలు మాత్రం దిగులు చెందారు. బయటికెళ్లి కరోనా బారినపడడం కంటే, అక్కడే సురక్షితంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. జైలు గోడలే వైరస్​ నుంచి కాపాడే రక్షక కవచాలని దృఢంగా నమ్మారు. వారిద్దరినీ జైల్లోనే ఉండేందుకు అనుమతివ్వాలంటూ కోర్టును ఆశ్రయించారు.

'కరోనా వేళ జైలు గోడలే మాకు శ్రీరామ రక్ష'
'కరోనా వేళ జైలు గోడలే మాకు శ్రీరామ రక్ష'

ఇదీ చదవండి:కడుపున బిడ్డను మోస్తూ.. 142కి.మీ కాలినడక

Last Updated : Apr 9, 2020, 1:31 PM IST

ABOUT THE AUTHOR

...view details