తెలంగాణ

telangana

By

Published : Jul 5, 2020, 12:52 PM IST

Updated : Jul 5, 2020, 1:25 PM IST

ETV Bharat / bharat

రాష్ట్రపతితో మోదీ భేటీ.. సరిహద్దు ఉద్రిక్తతలపై చర్చ

Prime Minister Narendra Modi met President Ram Nath Kovind at Rashtrapati Bhawan, earlier today.
రాష్ట్రపతిని కలిసిన ప్రధాని మోదీ

13:18 July 05

రాష్ట్రపతితో మోదీ భేటీ.. సరిహద్దు ఉద్రిక్తతలపై చర్చ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​తో భేటీ అయ్యారు. జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యాంశాలపై ఇరువురు రాష్ట్రపతి భవన్​లో చర్చించారు. తూర్పు లద్దాఖ్​లోని లేహ్​లో ప్రధాని మోదీ.. క్షేత్రస్థాయి పర్యటన అనంతరం రాష్ట్రపతితో మోదీ భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నేపథ్యంలోనే తన పర్యటన గురించి రాష్ట్రపతికి మోదీ వివరించినట్టు రాష్ట్రపతి భవన్​ ట్వీట్​ చేసింది.

సరిహద్దు ఉద్రిక్తతల మధ్య ప్రధాని మోదీ.. శుక్రవారం లద్దాఖ్​ లేహ్​లో పర్యటించారు. గల్వాన్​ వీరులకు నివాళులర్పించిన అనంతరం ఘటనలో గాయపడ్డ జవాన్లను పరామర్శించారు. అనంతరం చైనానుద్దేశించి తీవ్ర హెచ్చరికలు చేశారు.

12:47 July 05

రాష్ట్రపతిని కలిసిన ప్రధాని మోదీ

రాష్ట్రపతిని కలిసిన ప్రధాని మోదీ

భారత ప్రధాని నరేంద్ర మోదీ.. రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ను కలిశారు. జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యాంశాలపై ఇరువురూ రాష్ట్రపతి భవన్​లో చర్చించారు. లద్దాఖ్​ లేహ్​లో ప్రధాని.. క్షేత్రస్థాయి పర్యటన అనంతరం రాష్ట్రపతితో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. కరోనా పరిస్థితులపైనా చర్చించినట్లు సమాచారం.  

Last Updated : Jul 5, 2020, 1:25 PM IST

ABOUT THE AUTHOR

...view details