తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మంత్రి మండలి పరిచయం- రాజ్యసభ వాయిదా

రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన తర్వాత మంత్రి మండలిని ప్రధాని రాజ్యసభకు పరిచయం చేశారు. అనంతరం రేపు ఉదయం 11 గంటలకు సభను వాయిదా వేశారు ఛైర్మన్​ వెంకయ్యనాయుడు.

By

Published : Jun 20, 2019, 2:10 PM IST

మంత్రి మండలిని పరిచయం చేస్తోన్న ప్రధాని

రాజ్యసభకు నూతన మంత్రిమండలిని ప్రధాని నరేంద్ర మోదీ పరిచయం చేశారు. ప్రతి ఒక్కరి పేరు, శాఖను ప్రస్తావించారు. అనంతరం సభను ఛైర్మన్​ వెంకయ్య నాయుడు రేపు ఉదయం 11 గంటలకు వాయిదా వేశారు.

మంత్రి మండలిని పరిచయం చేస్తోన్న ప్రధాని

అంతకుముందు సభ్యుందరిని కీలక బిల్లుల ఆమోదానికి సహకరించాలని ప్రభుత్వం కోరింది. 16వ లోక్​సభ రద్దు చేసే సమయానికి రాజ్యసభలో 33 బిల్లులు పెండింగ్​లో ఉన్నాయి. ఆ బిల్లులను ఈ సెషన్​లో ఆమోదించేందుకు ప్రభుత్వం యత్నిస్తోంది. ఈ బిల్లులన్నీ 16వ లోక్​సభలో ఆమోదం పొందాయి.

ఈ సెషన్​ జులై 26 వరకు కొనసాగనుంది. మొత్తం 27 సార్లు రాజ్యసభ సమావేశం కానుంది.

ABOUT THE AUTHOR

...view details