ఉత్తర్ప్రదేశ్ కాన్పుర్లో పేరుమోసిన గ్యాంగ్స్టర్, 8 మంది పోలీసుల ప్రాణాలు పోయేందుకు కారణమైన రౌడీషీటర్ వికాస్ దూబే చట్టు ఉచ్చుబిగిస్తున్నారు అధికారులు. దూబేను పట్టుకునేందుకు 25 బృందాలను రంగంలోకి దించి గాలింపు ముమ్మరం చేశారు. అతనితో సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్న పోలీసులపై వేటు వేశారు.
"గ్యాంగ్స్టర్ను పట్టుకునేందుకు 40 పోలీస్ స్టేషన్ల నుంచి 25 బృందాలను రంగంలోకి దించాం. కొన్ని టీంలు ఇప్పటికే ఇతర రాష్ట్రాలకు వెళ్లాయి. త్వరలోనే దూబేను అరెస్ట్ చేస్తాం. దూబేతో సంబంధం ఉన్న కార్యకలాపాల్లో పాల్గొన్నట్లు అనుమానిస్తున్న ముగ్గురు పోలీసు అధికారులను సస్పెండ్ చేశాం."
- మోహిత్ అగర్వాల్, ఐజీ, కన్పూర్ రేంజ్
రివార్డు 2.5 లక్షలకు పెంపు..