తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రాజీనామాకు సిద్ధమైన దీదీ... పార్టీ నిరాకరణ

ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు తృణమూల్​ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ. లోక్​సభ ఎన్నికల్లో పరాభవంతోనే దీదీ ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే పార్టీ సభ్యులు వ్యతిరేకించిన కారణంగా రాజీనామాపై ఆమె వెనక్కి తగ్గారు.

By

Published : May 26, 2019, 5:15 AM IST

Updated : May 26, 2019, 8:22 AM IST

మమత బెనర్జీ

దీదీ రాజీనాామా

లోక్​సభ ఎన్నికల్లో పార్టీ తక్కువ స్థానాలు సాధించడం వల్ల అనూహ్య నిర్ణయం తీసుకున్నారు పశ్చిమ బంగాల్​ సీఎం మమతా బెనర్జీ. సిట్టింగ్​ స్థానాలు కోల్పోవటం కారణంగా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. తృణమూల్​ పార్టీ నేతలు వ్యతిరేకించడం వల్ల రాజీనామాపై వెనక్కితగ్గారు దీదీ.

ఫలితాల తర్వాత పార్టీ నేతలతో సమావేశమయ్యారు దీదీ. భేటీ అనంతరం మీడియాతో పలు అంశాలపై మాట్లాడారు.

"సీఎం పదవికి రాజీనామా చేయాలనుకున్నా. ఆ కుర్చీపై నాకు ఆశ లేదు. కానీ పార్టీ నా నిర్ణయాన్ని తిరస్కరించింది. సీఎం పదవి నాకు అవసరం లేదు. కానీ నేను ఆ స్థానానికి అవసరం. ఇన్ని రోజులు ప్రజల కోసం సేవ చేశాను. పార్టీ కోసం చేయాల్సిన సమయం వచ్చింది."

-మమతా బెనర్జీ, బంగాల్ ముఖ్యమంత్రి

భాజపా భారీ విజయంపై అనుమానాలు వ్యక్తం చేశారు మమత. ఎన్నికల ఫలితాల్లో విదేశీ హస్తం ఉందని ఆరోపించారు.

"ఇంత భారీ విజయం అనుమానాలను రేకెత్తిస్తోంది. అన్ని రాష్ట్రాల్లో విపక్షాలు పూర్తిగా ఎలా ఓడిపోతాయి? అధికారంలో ఉన్న రాజస్థాన్​, మధ్యప్రదేశ్​లోకాంగ్రెస్ ఓడిపోవటం ఏంటి? లక్ష మెజారిటీ వచ్చేలా ఈవీఎంలను సిద్ధం చేయించారు. ఇందులో విదేశీయుల హస్తం ఉండే అవకాశముంది. ఓట్ల కోసం కోట్లు ఖర్చు చేశారు. ఎన్నికల సంఘం పక్షపాతంగా వ్యవహరించింది. "

-మమతా బెనర్జీ, పశ్చిమ బంగాల్ ముఖ్యమంత్రి

ఇదీ చూడండి: 'దేశానికి ఇప్పుడు కాంగ్రెస్​ అవసరం ఉంది'

Last Updated : May 26, 2019, 8:22 AM IST

ABOUT THE AUTHOR

...view details