తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'బుజ్జగింపు రాజకీయాల వల్లే ముమ్మారు కొనసాగింది'

ముమ్మారు తలాక్​ దురాచారం ఏళ్ల తరబడి కొనసాగడానికి బుజ్జగింపు రాజకీయాలే  కారణమని కేంద్ర హోంమంత్రి అమిత్​ షా వ్యాఖ్యానించారు. ఈ అంశంపై దిల్లీలో నిర్వహించిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు షా.

By

Published : Aug 18, 2019, 9:26 PM IST

Updated : Sep 27, 2019, 10:53 AM IST

'బుజ్జగింపు రాజకీయాల వల్లే ముమ్మారు కొనసాగింది'

దేశ విభజనకు కారణమైన బుజ్జగింపు రాజకీయాలే ముమ్మారు తలాక్​ దురాచారం ఏళ్ల తరబడి కొనసాగడానికీ కారణమని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అన్నారు. దిల్లీలోని శ్యామప్రసాద్ ముఖర్జీ పరిశోధన సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముమ్మారు తలాక్​పై చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 2014లో ప్రధానిగా మోదీ విజయం.. బుజ్జగింపు రాజకీయాలను తరిమికొట్టేందుకు నాంది పలికిందన్నారు.

చర్చా కార్యక్రమంలో మాట్లాడుతున్న షా

"ముమ్మారు తలాక్​ దురాచారాన్ని నిర్మూలిస్తే ఇంత వ్యతిరేకత ఎందుకు వ్యక్తమైంది? దీని వెనక బుజ్జగింపు రాజకీయాల పాత్ర చాలా ఉంది. స్వాతంత్ర్యానికి ముందు.. దేశాన్ని విభజన నుంచి కాపాడేందుకు ప్రారంభమైన బుజ్జగింపు రాజకీయాలే భారత విభజనకు కారణమయ్యాయి. ఓటుబ్యాంకు పెంచుకునేందుకు ఓ ఉపాయంగా మారింది. ఓటుబ్యాంకు ఆధారంగా అధికారాన్ని కాపాడుకోవడం, తిరిగి అధికారంలోకి రావడం, ఏళ్ల తరబడి అధికారంలో ఉండడం....కొన్ని రాజకీయ పార్టీలకు అలవాటుగా మారింది. బుజ్జగింపు రాజకీయాలు ఈ దేశాన్ని చాలా విధాలుగా ధ్వంసం చేశాయి."

-అమిత్​ షా, కేంద్ర హోమంత్రి

ఇదీ చూడండి: జైట్లీ పరిస్థితి విషమం.. ఎయిమ్స్​కు ప్రముఖులు

Last Updated : Sep 27, 2019, 10:53 AM IST

ABOUT THE AUTHOR

...view details