తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మధ్యవర్తిత్వంపై నేతల హర్షం

అయోధ్య వివాదంలో మధ్యవర్తుల ప్యానెల్​ ఏర్పాటుపై రాజకీయ నేతలు హర్షం వ్యక్తం చేశారు. సామరస్యంగా సమస్య పరిష్కారం కావాలని అభిలషించారు.

By

Published : Mar 8, 2019, 7:16 PM IST

అయోధ్య వివాదం

అయోధ్య వివాదం

రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాద పరిష్కారానికి మధ్యవర్తుల ప్యానెల్​ నియామకాన్ని రాజకీయ నేతలు స్వాగతించారు. సమస్య పరిష్కారానికి సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుందని ప్రశంసించారు.

అయోధ్యలో రామమందిర నిర్మాణమే సమస్యకు అసలైన పరిష్కారమని భాజపా సీనియర్​ నేతలు వ్యాఖ్యానించారు.

"సుప్రీంకోర్టుకు పూర్తి అధికారం ఉంది. కోర్టు ఏది చెప్పినా గౌరవించాల్సిన అవసరముంది. అయితే రామ జన్మస్థానంలో రామమందిరం నిర్మించాల్సిందే. ఆ చుట్టుపక్కల రాముడికి సంబంధించిన ఆలయాలే ఉండాలి. మసీదులనూ మేం గౌరవిస్తాం. మక్కా మదీనాలో ఎవరైనా ఆలయం నిర్మించడానికి ప్రయత్నిస్తే మేమే అడ్డుకుంటాం. అది వారి ప్రదేశం. అక్కడ మసీదే ఉండాలి."
- ఉమాభారతి, కేంద్రమంత్రి

నిజాయితీ ప్రయత్నం

అయోధ్య వివాదం పరిష్కారానికి సుప్రీంకోర్టు నిజాయితీగా ప్రయత్నిస్తోందని బీఎస్పీ అధినేత్రి మాయావతి ప్రశంసించారు.

"అయోధ్య వివాద పరిష్కారానికి మధ్యవర్తి నియామకంతో సరైన నిర్ణయం తీసుకుంది సుప్రీం. సామరస్యంగా సమస్య పరిష్కారానికి కోర్టు ప్రయత్నిస్తోంది."
-మాయావతి, బీఎస్పీ అధినేత్రి

తటస్థ వ్యక్తులుండాలి

మధ్యవర్తుల ప్యానెల్​లో ఆధ్యాత్మిక గురువు శ్రీ శ్రీ రవిశంకర్ నియామకంపై మజ్లిస్​ నేత అసదుద్దీన్​ ఒవైసీ అభ్యంతరం వ్యక్తం చేశారు.

"తటస్థ వ్యక్తిని సభ్యుడిగా సుప్రీం నియమిస్తే బాగుండేది. అందులోని సభ్యుడు అయోధ్యపై బహిరంగ వ్యాఖ్యలు చేశారు. ముస్లింలు రాజీ పడకపోతే సిరియా తరహాలో భారత్​ మారుతుందని హెచ్చరించారు. మధ్యవర్తిగా ఉన్నప్పుడు ఆ భావనలు పక్కన పెడతారని ఆశిస్తున్నాను. సుప్రీం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం."
- అసదుద్దీన్ ఒవైసీ, ఏఐఎంఐఎం అధ్యక్షుడు

ఇదీ చూడండి: 'ఎస్పీ ప్రభుత్వం వల్లే'

"మధ్యవర్తిత్వంపై సుప్రీం గత పయత్నాలు విఫలమయ్యాయి. అయితే ఇప్పుడు కొన్ని మార్పులు చేశారు. కోర్టు పర్యవేక్షణలో చర్చలు జరగటం అభినందనీయం. చూద్దాం ప్యానెల్​ ఏం పరిష్కారం చూపుతుందో"
- బృందా కారాట్, సీపీఎం నాయకురాలు

ముస్లిం సంఘాల ప్రశంస

సుప్రీం నిర్ణయాన్ని అఖిల భారత ముస్లిం వ్యక్తిగత న్యాయ మండలి(ఏఐఎంపీఎల్​బీ) స్వాగతించింది.

"సుప్రీం కోర్టు నిర్ణయాన్ని స్వాగతించాల్సిన అవసరముంది. చర్చలతో సమస్య పరిష్కారమనేది మంచి నిర్ణయం. సుప్రీం పర్యవేక్షణలో గోప్యంగా ప్రక్రియ కొనసాగితే చర్చలు ఫలించే అవకాశముంటుంది."
-మౌలానా వాలి రెహ్మానీ, ఏఐఎంపీఎల్​బీ ప్రధాన కార్యదర్శి

ABOUT THE AUTHOR

...view details