తెలంగాణ

telangana

ETV Bharat / bharat

"ఏప్రిల్​ నెలాఖరుకల్లా కోటి మందిని చేరుస్తాం"

అసంఘటిత రంగ కార్మికులకు ఉద్దేశించిన 'ప్రధాన మంత్రి శ్రమ యోగి మాన్​ధన్' పథకంలో ఏప్రిల్​ నెలాఖరుకల్లా కోటి మంది చేరే అవకాశముందని కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది.

By

Published : Mar 24, 2019, 11:31 PM IST

ఏప్రిల్​ నెలాఖరు కల్లా కోటి మందిని చేరుస్తాం

అసంఘటిత రంగ కార్మికులు పింఛన్లు పొందడం కోసం కేంద్ర ప్రభుత్వం 'ప్రధాన మంత్రి శ్రమ యోగి మాన్​ధన్' (పీఎంసీవైఎం) పథకం ప్రవేశపెట్టింది. ఈ పథకంతో లబ్ధిపొందే వారి సంఖ్య ఏప్రిల్​ నెలాఖరకు కోటి దాటే అవకాశముందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. లబ్ధిదారులు 60 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత నెలకు 3 వేల చొప్పున ఫించను అందిస్తారు.

"ఈ పథకంలో ఇప్పటి వరకు 25 లక్షల 36 వేల మంది సభ్యులు చేరారు. రోజుకు లక్ష మంది కార్మికులను ఇందులో భాగస్వాములు చేస్తున్నాం. ఏప్రిల్​ నెలాఖరకు కోటి మందిని చేరుస్తామనే నమ్మకం ఉంది."
- దినేష్​ త్యాగి ,సీఎస్​సీఈ - గవర్నెస్ సంస్థ ముఖ్యకార్య నిర్వాహణాధికారి.

దేశ వ్యాప్తంగా ఉన్న సీఎస్​సీ (కామన్​ సర్వీసు​ సెంటర్లు)లో దరఖాస్తులు సమర్పించి ఈ పథకంలో చేరవచ్చు.

డిసెంబర్​ నెలాఖరు నాటికి పథకంలో చేరే వారి సంఖ్య 5 కోట్లు దాటవచ్చని దినేష్​ త్యాగి తెలిపారు.

వచ్చే ఐదేళ్లలో 10 కోట్ల మందిని పీఎంఎస్​వై పథకంలో చేర్చడమే ప్రభుత్వ లక్ష్యం. ఇందుకు తగ్గట్టుగానే అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది సీఎస్​సీ.

అసంఘటిత రంగంలో పనిచేస్తున్న 18- 40 ఏళ్ల లోపు వారు ఈ పథకానికి అర్హులు. 18 ఏళ్ల వయసు వారు నెలకు 55 రూపాయలు, 40 ఏళ్లు ఆ పైన ఉన్నవారు నెలకు 200 రూపాయలు చొప్పున ప్రీమియం చెల్లించాలి.

అసంఘటిత రంగంలో పనిచేసే వారి వివరాల లభ్యత చాలా తక్కువ. ఈ సమస్యను అధిగమించేందుకు ప్రభుత్వం వారి వివరాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టింది. ఉత్తరప్రదేశ్​, హరియణా, మహరాష్ట్రలో ఇప్పటికే ఈ ప్రక్రియ మొదలైంది.

ఇదీ చూడండీ:'2025 నాటికి క్షయ రహిత భారత్​ను నిర్మిద్దాం'

ABOUT THE AUTHOR

...view details