తెలంగాణ

telangana

'నిసర్గ'పై ముఖ్యమంత్రులతో ప్రధాని చర్చ

By

Published : Jun 2, 2020, 8:53 PM IST

అరేబియా సముద్రం నుంచి పశ్చిమ తీరం వైపుగా దూసుకొస్తున్న 'నిసర్గ' తుపాను అంశమై మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సంభాషించారు ప్రధాని మోదీ. కేంద్రం నుంచి వీలైనంతవరకు సాయం చేస్తామని వారికి భరోసా ఇచ్చారు.

PM speaks with Maha, Guj CMs on cyclone Nisarga situation
'తుపాను వేళ.. మీకు అండగా మేమున్నాం'

భారత పశ్చిమ తీరం దిశగా ముంచుకొస్తున్న 'నిసర్గ' తుపాను వల్ల ముప్పు పొంచి ఉన్న మహారాష్ట్ర, గుజరాత్​ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉద్ధవ్ ఠాక్రే, విజయ్​ రూపానీతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంభాషించారు. కేంద్రం నుంచి ఎటువంటి సాయం చేయడానికైనా సిద్ధంగా ఉన్నట్లు భరోసా ఇచ్చారు. దమన్​ దీవ్​, దాద్రా నగర్​ హవేలీ పాలకులతోనూ మోదీ మాట్లాడినట్లు ప్రధాని కార్యాలయం ప్రకటించింది.

పీఎంఓ ట్వీట్​

వేగంగా దూసుకొస్తున్న నిసర్గ తుపాను​.. జూన్​ 3 సాయంత్రం నాటికి ఉత్తర మహారాష్ట్ర, దక్షిణ గుజరాత్​ తీరాలను దాటనున్నట్లు భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.

ఇదీ చూడండి:ముంచుకొస్తున్న 'నిసర్గ' తుపాను.. పశ్చిమ తీరం హై అలర్ట్​

ABOUT THE AUTHOR

...view details