తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నేడు రాజీవ్​గాంధీ జయంతి.. ప్రముఖుల ఘన నివాళి

రాజీవ్​గాంధీ జయంతి పురస్కరించుకుని ఆయనకు ప్రధాని మోదీ సహా పలువురు నేతలు నివాళులర్పించారు. వీర్​భూమి వద్ద దివంగత నేతకు... కుటుంబసభ్యులు సోనియాగాంధీ, రాహుల్​గాంధీ, మాజీ రాష్ట్రపతి ప్రణబ్​ముఖర్జీ, మాజీ ప్రధాని మన్మోహన్ తదితరులు అంజలి ఘటించారు.

By

Published : Aug 20, 2019, 10:23 AM IST

Updated : Sep 27, 2019, 3:15 PM IST

నేడు రాజీవ్​గాంధీ జయంతి.. ప్రముఖుల ఘన నివాళి

నేడు మాజీ ప్రధాని, దివంగత నేత రాజీవ్​గాంధీ 75వ జయంతి. ఈ సందర్భంగా దిల్లీలోని వీర్​భూమి వద్ద ఆయన సతీమణి, కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజీవ్​కు పుష్పాంజలి ఘటించారు. కుమారుడు రాహుల్​గాంధీ, కుమార్తె ప్రియాంక గాంధీ తమ తండ్రికి నివాళులర్పించారు.

నేడు రాజీవ్​గాంధీ జయంతి.. ప్రముఖుల ఘన నివాళి

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్విట్టర్​ వేదికగా రాజీవ్​గాంధీకి అంజలి ఘటించారు.

"మాజీ ప్రధాని శ్రీ రాజీవ్​గాంధీ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు" - నరేంద్రమోదీ, ప్రధానమంత్రి.

రాజీవ్​గాంధీకి మోదీ నివాళి

రాజీవ్​గాంధీ జయంతి సందర్భంగా మాజీ రాష్ట్రపతి ప్రణబ్​ముఖర్జీ, మాజీ ప్రధాని మన్మోహన్​ సింగ్​, రాజ్యసభలో విపక్షనేత గులాంనబీ ఆజాద్​ తదితరులు అంజలి ఘటించారు. రాజీవ్​గాంధీ సేవలను స్మరించుకున్నారు.

సద్భావన దివస్​

రాజీవ్​గాంధీ 1944 ఆగస్టు 20న అప్పటి బొంబాయిలో జన్మించారు. ఆయన జయంతిని కాంగ్రెస్... 'సద్భావన దివస్​'గా పాటిస్తోంది.

ఇదీ చూడండి: చందమామ కక్ష్యలోకి ప్రవేశించిన చంద్రయాన్​-2

Last Updated : Sep 27, 2019, 3:15 PM IST

ABOUT THE AUTHOR

...view details