న్యూజిలాండ్లో జరిగిన సాధారణ ఎన్నికల్లో రెండోసారి ఘన విజయం సాధించిన ఆ దేశ ప్రధాని జెసిండా ఆర్డెర్న్కు.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.
ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను నూతన శిఖరాలకు చేర్చేలా ఆర్డెర్న్ నేతృత్వంలోని సర్కార్తో మరోసారి పనిచేసేందుకు ఎదురు చూస్తున్నానని మోదీ ట్వీట్ చేశారు.
"అద్భుతమైన విజయం సాధించిన న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెర్న్కు నా హృదయపూర్వక అభినందనలు. సంవత్సరం క్రితం కలిసిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ.. భారత్-న్యూజిలాండ్ మధ్య సంబంధాలను అత్యున్నత స్థాయికి చేర్చడం కోసం కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నాను."