తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కర్తార్​పుర్​ నడవా త్వరగా ప్రారంభం కావాలి'

కర్తార్​పుర్​ నడవా త్వరగా ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని పాక్​ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​ను భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. ఏడాదంతా రాకపోకలు జరిగేలా అనుమతించాలని లేఖలో పేర్కొన్నారు.

By

Published : Jun 21, 2019, 6:45 AM IST

మోదీ-ఇమ్రాన్

పాకిస్థాన్​ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​కు ప్రధాని నరేంద్రమోదీ లేఖ రాశారు. రెండో సారి ప్రధానిగా ఎన్నికైన సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఇమ్రాన్​ రాసిన లేఖకు మోదీ ప్రత్యుత్తరం పంపారు. కర్తార్​పుర్​ నడవా త్వరగా ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారని విదేశాంగ శాఖ తెలిపింది.

"పాక్​ ప్రధానికి మోదీ రాసిన లేఖలో కర్తార్​పుర్​ నడవా విషయం ప్రస్తుతించారు. కర్తార్​పుర్​ నడవా త్వరగా ప్రారంభమయ్యేలా కృషి చేస్తున్నామని తెలిపారు. మీరూ అందుకు సహకరించాలి. ఇది ఏడాది పొడవునా పనిచేయాలన్నారు."

- రవీశ్ కుమార్​, విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి

కర్తార్​పుర్​ నడవా నిర్మించాలని ఎన్నో ఏళ్లుగా యాత్రికులు డిమాండ్​ చేస్తున్నారు. ఈ విషయంలో వారి ఆకాంక్షలకు అనుగుణంగా పూర్తి చేసేందుకు భారత ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రవీశ్ తెలిపారు.

2018 నవంబర్​లో కర్తార్​పుర్​ గురుద్వారా దర్బార్​ సాహిబ్​ నుంచి భారత్​లోని గురుదాస్​పుర్​ డేరా బాబా నానక్​కు అనుసంధానం చేసేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి. అదే ఏడాది నవంబర్​ 26న గురుదాస్​పుర్​లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, పంజాబ్​ ముఖ్యమంత్రి అమరీందర్​ సింగ్​ శంకుస్థాపన చేశారు. రెండ్రోజుల తర్వాత కర్తార్​పుర్​లోని నరోవాల్​లో పాక్​ పధాని ఇమ్రాన్​ ఖాన్​ పునాది రాయి వేశారు.

ఇదీ చూడండి: 'కర్తార్​పుర్'​పై దాయాదుల చర్చ

ABOUT THE AUTHOR

...view details