తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'గురునానక్​ కలల సాకారం కోసం ప్రజలు ఏకమవ్వాలి'

నేడు సిక్కు మతగురువు గురునానక్​ 550వ జయంతి. ఈ సందర్భంగా దేశప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని మోదీ. గురునానక్​ కలల్ని సాకారం చేయడానికి ప్రజలు ఏకమవ్వాలని ట్వీట్​ చేశారు.

By

Published : Nov 12, 2019, 1:02 PM IST

'గురునానక్​ కలల్ని సాకారం చేయడానికి ప్రజలు ఏకమవ్వాలి'

గురునానక్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. సమ్మిళిత, సామరస్యపూర్వక సమాజం నిర్మించాలన్న గరునానక్​ కలల్ని దేశప్రజలు కలిసి నెరవేర్చాలని ట్విట్టర్​ ద్వారా పిలుపునిచ్చారు.


"గురునానక్ 550వ జయంతి సందర్భంగా ప్రజలందరికీ నా శుభాకాంక్షలు. గురునానక్ కలగన్న సమ్మిళిత, సామరస్య సమాజం నిర్మించడానికి ప్రజలందరూ కలిసి తోడ్పడాలి. ఆయన కలల్ని మనమందరం సాకారం చేయాలి."

-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.

గురునానక్​ జయంతి సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్​ షా ట్విట్టర్​ వేదికగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

"సిక్కు మత గురువు గురునానక్​ దేవ్​జీ.. భారతదేశంలో సాధువు సంప్రదాయానికి ప్రత్యేకమైన చిహ్నంగా నిలిచారు. ఆయన ఆలోచనలు, బోధనలు, ప్రజాసేవ చేయాలనే సంకల్పం మనకు ప్రేరణ ఇస్తాయి. చారిత్రక కర్తార్​పుర్​ నడవాను మోదీ ప్రారంభించి, దేశ ప్రజలకు అంకితం చేసి గురునానక్​కు హృదయపూర్వక నివాళి అర్పించారు. మోదీ ప్రభుత్వం.. గురునానక్​ ఆలోచనలను, బోధనలను గౌరవిస్తుంది. సబకా సాత్​- సబకా వికాస్​ మా ప్రధాన నినాదం."

-అమిత్​ షా, కేంద్ర హోం మంత్రి.

గురునానక్ జయంతిని వైభవంగా జరుపుకొనేందుకు వందలాది మంది భక్తులు గురుద్వారాలకు తరలివెళ్తున్నారు.

ఇదీ చూడండి : ఆకతాయి దెయ్యాల 'సరదా' తీర్చిన పోలీసులు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details