తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'రాహుల్​ పోటీ చేయకుండా నిషేధించాలి'

రాహుల్​ పౌరసత్వం వివాదం పరిష్కారమయ్యే వరకు ఆయన ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించాలని సుప్రీంకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. ఈ పిటిషన్​పై వచ్చే వారం విచారణ జరిగే అవకాశముంది.

By

Published : May 2, 2019, 4:16 PM IST

'రాహుల్​ పోటీ చేయకుండా నిషేధించాలి'

కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ పౌరసత్వం వివాదంపై సుప్రీంకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. పౌరసత్వంపై స్పష్టత వచ్చేవరకు లోక్​సభ ఎన్నికల్లో ఆయన పోటీ చేయడాన్ని నిషేధిస్తూ ఎన్నికల సంఘం, కేంద్ర ప్రభుత్వంతో ఆదేశాలు జారీ చేయించాలని పిటిషనర్లు న్యాయస్థానాన్ని కోరారు.

2015 నవంబర్​లో భారతీయ జనతా పార్టీ నేత సుబ్రహ్మణ్య స్వామి... రాహుల్​ స్వచ్ఛందంగా బ్రిటన్​ పౌరసత్వాన్ని పొందారన్న సమాచారాన్ని కేంద్రానికి ఇచ్చారని పిటిషన్​లో పేర్కొన్నారు. అయినప్పటికీ హోం శాఖ చర్యలు తీసుకోకపోవటంపై అసంతృప్తిగా ఉన్నట్లు పిటిషనర్లు జయ్​ భగవాన్​ గోయల్​, సీపీ త్యాగీ తెలిపారు. ప్రాథమిక ఆధారాలు సమర్పించినందున... లోక్​సభ ఎన్నికల్లో రాహుల్​ను పోటీ చేయనీయరాదని వాదించారు.

ఓటర్ల జాబితా నుంచి రాహుల్​ పేరు తొలగించేలా ఈసీని ఆదేశించాలని పిటిషనర్ల తరపు న్యాయవాది బరున్​ కుమార్​ సిన్హా అభ్యర్థించారు. ఈ వ్యాజ్యంపై విచారణ వచ్చే వారం జరిగే అవకాశం ఉంది.

ఇదీ చూడండి: 'ఉదయం 5 నుంచి పోలింగ్​ నిర్వహించలేరా?'

ABOUT THE AUTHOR

...view details