తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'పైప్​ కంపోస్ట్'​తో చెత్త నుంచి సిరుల పంట

ఇంట్లోని చెత్తను మనం బయటపడేస్తుంటాం. కానీ కర్ణాటక తుమకూరు జిల్లాకు చెందిన ప్రజలు మాత్రం చెత్తాచెదారాలతోనే ఎరువును తయారు చేస్తున్నారు. ఇలా ఇంట్లోనే స్వచ్ఛమైన ఎరువును తయారు చేసి మొక్కల సాగుకై వినియోగిస్తున్నారు.

By

Published : Dec 26, 2020, 6:30 AM IST

Pipe Compost Project that simplifies garbage management
ఇంటి వ్యర్థాలతోనే స్వచ్ఛమైన ఎరువు తయారీ..

'పైప్​ కంపోస్ట్'​తో చెత్త నుంచి సిరుల పంట

పట్టణ ప్రజలు రోజూ ఎదుర్కొనే సమస్యల్లో చెత్త ఒకటి. చెత్తను నిల్వ చేస్తే దుర్వాసన వస్తుంది. అలా అని ఎక్కడ పడితే అక్కడ పడేయలేని పరిస్థితి. ఇలాంటి క్లిష్ట సమస్యకు వినూత్న పరిష్కారాన్ని చూపారు కర్ణాటక తుమకూరు జిల్లా ప్రజలు. అదే 'పైప్​ కంపోస్ట్​ ప్రాజెక్ట్'.​ ఈ విధానంతో ఇంట్లో నుంచి వెలువడే చెత్త, వ్యర్థాలతోనే స్వచ్ఛమైన ఎరువును తయారు చేస్తున్నారు. ప్రస్తుతం ఒక్క తుమకూరు మెట్రోపాలిటన్ ప్రాంతంలోనే దాదాపు 3వేలకు పైగా ఇళ్లలో ఈ విధానం అమలవుతోంది.

స్వచ్ఛమైన ఎరువు మొక్కల సాగుకై
గొట్టాన్ని అమర్చే విధానం

వ్యర్థాలతో ఎరువు ఎలా ?

ముందుగా ఒక పైపును తీసుకుని, ఒకటిన్నర అడుగు మేర తోటలో కానీ మొక్కలు ఉన్న ప్రదేశంలో కానీ పూడ్చి పెట్టాలి. ఆ గొట్టం చుట్టూ రంధ్రాలు చేయాలి. తర్వాత రోజూ ఇంట్లో వెలువడే చెత్త, వ్యర్థాలను పైపులో వేయాలి. కొంత పేడ కానీ మట్టి కానీ వారానికి ఒకసారి ఆ గొట్టంలో పడేయాలి. ఇలా చేయటం వల్ల రసాయనిక చర్య జరిగి ఎరువు తయారవుతుంది.

మొక్కలకు దన్నుగా..

వ్యర్థాలతో తయారైన ఎరువు

ఈ ఎరువును మొక్కల పెంపకానికి వినియోగించవచ్చు. తుమకూరులో దాదాపు 100-200 కుటుంబాలు ప్రస్తుతం ఈ విధానం ద్వారా ఎరువు తయారు చేస్తున్నాయి. చుట్టుపక్కల ఉన్న తోటల​ యజమానులు, రైతులు సైతం ఈ ఎరువు కొనుగోలుకు ఆసక్తి కనబరుస్తున్నారు.

పైప్​ కంపోస్ట్​ విధానాన్ని తుమకూరు జిల్లాలో ప్రతి కుటుంబం పాటించాలని స్థానిక అధికారులు సూచిస్తున్నారు. ఈ విధానంపై అవగాహన కల్పిస్తున్నారు.

ఇదీ చదవండి :రైతుల కోసం 'కిసాన్​ మాల్​'- అన్నీ ఫ్రీ!

ABOUT THE AUTHOR

...view details