తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పైలట్​ విడుదల నేడే

తమ వద్ద బందీగా ఉన్న భారత వైమానిక దళం(ఐఏఎఫ్‌) పైలట్​ను విడిచిపెట్టేందుకు పాక్​ అంగీకరించింది. శాంతికాముక సంకేతంగా విడుదల చేస్తున్నట్లు తెలిపింది. ఆయనను బేషరతుగా విడుదల చేయాల్సిందేనంటూ భారత్‌ గట్టిగా డిమాండ్‌ చేసిన గంటల వ్యవధిలోనే పాక్‌ ఈ నిర్ణయం తీసుకొంది.

By

Published : Mar 1, 2019, 9:09 AM IST

పైలట్​ విడుదల నేడే

ఐఏఎఫ్‌ పైలట్‌ను వాఘా సరిహద్దుల నుంచి స్వదేశానికి తీసుకురానున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. భారత్‌తో పెరుగుతున్న ఉద్రిక్తతలపై గురువారం నిర్వహించిన పాకిస్థాన్‌ పార్లమెంటు సంయుక్త సమావేశంలో ఆ దేశ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ మాట్లాడుతూ.. శాంతిని కాంక్షిస్తూ, సంప్రదింపుల కోసం తొలి అడుగుగా భారత పైలట్​ను శుక్రవారం విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఏ సమస్యకూ యుద్ధం పరిష్కారం కాదని, ఉద్రిక్తతల్ని పెంచొద్దని భారత నాయకత్వాన్ని కోరారు.

భారత పైలట్​ను బేషరుతుగా విడుదల చేయాలని ఇందులో రాజీపడే ప్రసక్తే లేదని భారత్‌ గట్టిగా డిమాండ్‌ చేసిన గంటల వ్యవధిలోనే పాక్‌ ఈ నిర్ణయం తీసుకుంది.
భారత వాయుసేన సైనికుడి విడుదలను భారత్, అమెరికా​ సహా పలు దేశాలు స్వాగతించాయి. వింగ్​ కమాండర్​ను పాక్​ భారత్​కు అప్పగించేందుకు సుముఖత వ్యక్తం చేయడంపై ఐక్యరాజ్యసమితి హర్షం వ్యక్తం చేసింది.

" భారత పైలట్​ను విడుదల చేయాలన్న పాక్​ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం."
- ఆంటోనియో గుటేరస్​, ఐక్యరాజ్యసమితి ప్రతినిధి

ఈ చర్యను అగ్రదేశం అమెరికా సహా పలు దేశాలు ముక్తకంఠంతో స్వాగతించాయి.

ABOUT THE AUTHOR

...view details