తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'వాజ్​పేయీ నమ్మకాన్ని సైన్యం వమ్ము చేయలేదు'

నియంత్రణ రేఖ వద్ద శాంతి నెలకొని ఉందని, పరిస్థితులు నియంత్రణలోనే ఉన్నాయని వెల్లడించారు సైన్యాధిపతి బిపిన్ రావత్. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా జమ్ముకశ్మీర్​ ద్రాస్​ సెక్టార్​లోని యుద్ధ స్మారకం వద్ద జ్యోతిని వెలిగించి నివాళులర్పించారు. కార్గిల్ యుద్ధంలో నాటి ప్రధానమంత్రి వాజ్​పేయీ పెట్టుకున్న నమ్మకాన్ని సైన్యం వమ్ము చేయలేదన్నారు.​

By

Published : Jul 26, 2019, 12:18 PM IST

'వాజ్​పేయీ నమ్మకాన్ని సైన్యం వమ్ము చేయలేదు'

జవాన్లకు కొన్నిసార్లు ఆహారం లేకపోయినా దేశ రక్షణ కోసం పోరాటాన్ని కొనసాగిస్తారని తెలిపారు సైనికాధిపతి బిపిన్ రావత్. కార్గిల్​ యుద్ధంలో విజయం సాధించి 20 ఏళ్లయిన సందర్భంగా జమ్ముకశ్మీర్​ ద్రాస్​లోని కార్గిల్ యుద్ధస్మారకం వద్ద జ్యోతి వెలిగించి నివాళులర్పించారు.

'పరాభవం తప్పదు'

మరోసారి దుస్సాహసానికి ఒడిగడితే పరాభవం తప్పదని దాయాది పాక్​కు పరోక్ష హెచ్చరికలు చేశారు బిపిన్ రావత్. సైన్యానికి అధునాతన ఆయుధాలు సమకూర్చేందుకు యత్నిస్తున్నామని స్పష్టం చేశారు. 2020 కల్లా హవిట్జర్​లను సైన్యంలో ప్రవేశపెడతామని, కే-9 క్షిపణులను దేశంలో తయారు చేస్తున్నామని వెల్లడించారు. బోఫోర్స్​ను పోలిన శతఘ్నులు రెండింటిని దేశీయంగా రూపొందిస్తున్నట్లు స్పష్టం చేశారు.

'వాజ్​పేయీ నమ్మకాన్ని సైన్యం వమ్ము చేయలేదు'

"సైన్యం కార్గిల్​ యుద్ధంలో చారిత్రక విజయం సాధించి 20 ఏళ్లు. ఈ యుద్ధంలో చొరబాటుకు దుస్సాహసం చేసిన పాకిస్థానీలను వెనక్కి పంపించాం. కార్గిల్ సహా ద్రాస్​,ఆలేఖ్ నుంచి సుఖ్​ వరకు దురాక్రమించేందుకు యత్నించిన వారిని విజయవంతంగా తిప్పికొట్టాం. దురాక్రమణదారులను వెనక్కి తరమాలని సైన్యానికి ఆదేశిస్తూ నాటి ప్రధాని వాజ్​పేయీ చేసిన వ్యాఖ్యలను ఇప్పుడు గుర్తు చేసుకోవాలి. ఆయన చొరబాటుదారులను వెనక్కి పంపించాలని తెలిపారు. యుద్ధ రంగంలోకి వెళ్లకముందే విజయం మనదే అని వ్యాఖ్యానించారు. నాటి ప్రధాని వాజ్​పేయీ నమ్మకాన్ని సైన్యం వమ్ము చేయలేదు. లక్ష్యం ఎంత పెద్దదైనా, క్లిష్టమైనా సైన్యం చేసి చూపిస్తుంది. సరిహద్దును కాపాడుతుంది. దేశ ప్రజలందరు సురక్షితంగా నిద్రపోయేలా కాపాలా కాస్తుంది. సైనికులకు ప్రోత్సాహం కలిగించేలా దేశ ప్రజల నుంచి మద్దతు ఉంటే చాలు."

-బిపిన్ రావత్, సైనికాధిపతి

ఇదీ చూడండి: ఈ సా.6గంటలకు సీఎంగా యడ్యూరప్ప ప్రమాణం!

ABOUT THE AUTHOR

...view details