సోమవారం జరగనున్న బలపరీక్షతో కుమారస్వామి నేతృత్వంలోని అధికార కూటమి భవితవ్యం తేలిపోనుంది. ఈ నేపథ్యంలో శాసనసభలోని పార్టీలన్నీ వ్యూహాలు రచించడంలో మునిగితేలుతున్నాయి.
సంకీర్ణ కూటమిలోని కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు సమావేశాల్లో తలమునకలయ్యాయి. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్ప పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ అయి సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు.
కాంగ్రెస్ శాసనసభా పక్షం.. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నేతృత్వంలో నేటి సాయంత్రం భేటీ కానుంది. ముంబయిలో ఉన్న ఎమ్మెల్యేలను వెనక్కి తీసుకువచ్చేందుకు కూటమి నేతలు ఆఖరి ప్రయత్నాలు చేస్తున్నారు. సోమవారం బలపరీక్షలో నెగ్గుతామని విశ్వాసం వ్యక్తం చేశారు కాంగ్రెస్ నేత డీకే శివకుమార్. రాజీనామా చేసి ఉపసంహరించుకున్న ఎమ్మెల్యే రామలింగారెడ్డి... జేడీఎస్ దళపతి దేవెగౌడతో సమావేశం కావడం తిరుగుబాటు ఎమ్మెల్యేలను వెనక్కి తెచ్చే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయనడానికి నిదర్శనంగా కన్పిస్తోంది.
తాజా పరిణామాలపై గవర్నర్