తెలంగాణ

telangana

By

Published : Jan 10, 2020, 3:58 PM IST

ETV Bharat / bharat

పాక్ కవ్వింపు చర్యల్లో ఇద్దరు జవాన్లు మృతి!

జమ్ముకశ్మీర్​లో నియంత్రణ రేఖ వెంబడి మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది పాక్. పూంచ్​ జిల్లా గుల్​పుర్​ సెక్టార్​లో దాయాది​ జరిపిన కాల్పుల్లో ఇద్దరు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు గాయపడ్డారు.

JK-SHELLING
JK-SHELLING

నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్​ దుశ్చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా పూంచ్​ జిల్లా గుల్​పుర్​ సెక్టార్​లో నియంత్రణ రేఖ వెంబడి కాల్పుల విరమణకు పాల్పడింది పొరుగుదేశం. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు మృతిచెందగా.. మరో ముగ్గురు గాయపడ్డారు.

ఎల్ఓసీ వెంబడి ఉన్న సైనిక స్థావరాలే లక్ష్యంగా ఉదయం 11 గంటల ప్రాంతంలో పాక్​ కాల్పులకు పాల్పడినట్లు అధికారులు వెల్లడించారు. గాయపడిన వారని ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ప్రాణాలు కోల్పోయిన జవాన్ల మృతదేహాలు స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నాలు చేపట్టినట్లు స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details