తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వరి క్వింటాలుకు కనీస మద్దతు ధర రూ.65 పెంపు

రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ ఖరీఫ్​ సీజన్​కు వరి పంటకు కనీస మద్దతు ధర 3.7 శాతంతో రూ.65 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం వరి క్వింటాలుకు రూ.1750 నుంచి రూ.1815కు పెరిగింది. ప్రధాని మోదీ నేతృత్వంలోని ఆర్థిక వ్యవహారాల కమిటీ ఆమోదం తెలిపింది.

By

Published : Jul 3, 2019, 5:41 PM IST

వరి క్వింటాలుకు కనీస మద్దతు ధర రూ.65 పెంపు

రైతుల సంక్షేమానికి పెద్ద పీట వేస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఆ మేరకు నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి మోదీ నేతృత్వంలోని కేబినేట్​ కమిటి భేటీలో తీపి కబురు చెప్పింది. 2019-20 పంట కాలానికి అన్ని పంటలకు కనీస మద్దతు ధర (ఎమ్​ఎస్​పీ) పెంచుతూ నిర్ణయం తీసుకుంది. వరికి క్వింటాలు ధరలో 3.7 శాతంతో రూ.65 పెంచింది. ప్రస్తుతం వరి క్వింటాలుకు రూ.1750 నుంచి రూ.1815కు చేరుకుంది.

వివిధ పంటల కనీస మద్దతు ధర పెంపు ఈ విధంగా ఉంది...

పంట రకం క్వింటాలకు పెంచిన ధర
వరి 65
జొన్నలు 120
రాగులు 253
కందులు 215
పెసరపప్పు 75
మినుములు 100
వేరుశనగ 200
సోయా 311
సాధారణ రకం పత్తి 105
పత్తి పొడువు పింజ 100

ఇదీ చూడండి: రాహుల్​ నిష్క్రమణ... కాంగ్రెస్​కు కొత్త అధ్యక్షుడు!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details